యూఏఈలో వీసా క్షమాభిక్ష.. ప్రవాస కుటుంబాలు హర్షం
- August 02, 2024
యూఏఈ: రెండు నెలల క్షమాభిక్ష కార్యక్రమాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 1 నుండి ప్రారంభించనున్నట్లు యూఏఈ ప్రకటించింది. ఈ సమయంలో ఉల్లంఘించిన వారి వీసా స్థితిని క్రమబద్ధీకరించుకోవచ్చు. క్షమాభిక్ష పథకంపై చాలా మంది ప్రవాసుల కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. యూఏఈ ఆరేళ్ల క్రితం ఆగస్ట్ 1, 2018న మూడవ రెసిడెన్సీ క్షమాభిక్ష పథకాన్ని ప్రారంభించింది. ఇది వేలాది మందికి ఉపయోగపడింది. చాలా మంది రెసిడెన్సీ ఉల్లంఘించినవారు తమ స్థితిని సరిదిద్దుకోవడంతోపాటు దేశం విడిచి వెళ్లారు.
చివరిసారి ఎమిరేట్స్ వ్యాప్తంగా క్షమాభిక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. దుబాయ్లో అల్ అవీర్లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA)లో కేంద్రానికి వేలాది మంది నివాసితులు తరలివచ్చారు. క్షమాభిక్ష పొందేందుకు ముందుగా వచ్చిన వారిలో 60 ఏళ్ల పాకిస్థానీ జెహెర్ జహాన్ ఉన్నారు. అతను 30 ఏళ్లుగా యూఏఈలో కార్పెంటర్గా పని చేస్తున్నారు. దీంతో ఇంటికి వెళ్లి తన జీవిత చివరి రోజుల్లో తన కుటుంబంతో కలిసి ఉండాలన్న కోరిక నెరవేరింది. అలా చాలా మంది భారతీయులు, పాకిస్థానీయులు, శ్రీలంక వాసులు, బంగ్లాదేశీయులు మరియు ఫిలిపినోలు తమ దేశాలకు వెళ్లి తమ కుటుంబాలను కలుసుకున్నారు. అనేక మందికి జరిమానాలను రద్దు చేశారు. ఇన్నాళ్లకు క్షమాభిక్ష పథకాన్ని ప్రకటించడంతో యూఏఈలో ఉంటున్న ప్రవాసుల కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి