న్యాయవ్యవస్థను కాపాడేందుకు కలిసికట్టుగా పనిచేద్దాం: కేటీఆర్
- August 02, 2024
హైదరాబాద్: రాజకీయంగా విబేధాలు ఉన్నప్పటికీ న్యాయ వ్యవస్థను కాపాడేందుకు సమిష్ఠిగా కలిసి పని చేయాలని మాజీ మంత్రి కేటీఆర్ ( KTR ) సూచించారు. శుక్రవారం శాసనసభలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టిన సివిల్ కోర్టుల సవరణ బిల్లుపై ఆయన చర్చను ప్రారంభించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లును సమర్థిస్తూ, స్వాగతిస్తున్నట్లు తెలిపారు. రాజకీయంగా విబేధాలు ఉన్నప్పటికీ న్యాయ వ్యవస్థను కాపాడేందుకు సమిష్ఠిగా కలిసి పని చేయాలని సూచించారు. రాష్ట్రంలో సైబర్ నేరాలు, అత్యాచారాలు, హత్యలు విపరీతంగా పెరిగాయని ఆరోపించారు. ‘అత్యాచారాలు చేసిన వారికి త్వరగా శిక్షపడేలా చర్యలు తీసుకోవాలి. అత్యాచారాలు, సైబర్క్రైమ్పై ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. బాధితులకు త్వరగా న్యాయం జరుగుతుందనే భరోసా ఇవ్వాలి.’ అని కేటీఆర్ అన్నారు. కేంద్ర కొత్తగా తీసుకొచ్చిన చట్టాలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరేంటో చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్రం తెచ్చిన చట్టాలతో రాష్ట్రానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛను హరించే చట్టాలు తేవడం మంచిది కాదని చెప్పారు. కొత్త చట్టాల వల్ల తెలంగాణను పోలీసు రాజ్యంగా మారుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయన్నారు.‘ కేంద్రం తెచ్చిన కొత్త చట్టాలను కర్ణాటక, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలు కొంత మార్పులు చేర్పులు చేశాయి. ఈ చట్టాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి’ అని కేటీఆర్ సూచించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి