అనుమానాస్పద ఆర్థిక కార్యకలాపాలు..2 బిలియన్ దిర్హామ్ల ఆస్తులు సీజ్..!!
- October 10, 2024
యూఏఈ: మనీలాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్ను ఎదుర్కోవడానికి యూఏఈ అనుమానాస్పద ఆర్థిక కార్యకలాపాలపై నిఘాను పెంచింది. 2023లో 2 బిలియన్ దిర్హామ్ల కంటే ఎక్కువ విలువైన నిధులు, ఆస్తుల జప్తు చేసినట్టు యూఏఈ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ఖలీద్ మొహమ్మద్ బాలమా తెలిపారు. అబుదాబిలో జరిగిన ఆర్థిక నేరాల జాతీయ సమ్మిట్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూఏఈ తన ఆర్థిక రంగం సమర్థత, సమగ్రతను కాపాడుకోవడంలో గణనీయమైన పురోగతిని సాధించిందని అన్నారు. యూఏఈ రెగ్యులేటరీ అధికారులు ఉల్లంఘించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకున్నారని, 2022లో Dh80 మిలియన్లతో పోలిస్తే, 250 మిలియన్ల కంటే ఎక్కువ ఆర్థిక ఆంక్షలు విధించినట్టు ఆయన వివరించారు. ఫైనాన్షియల్ సెక్టార్లోని లావాదేవీల పర్యవేక్షణ 2023లో మూడు రెట్లు పెరిగిందని గవర్నర్ తెలిపారు. గత సంవత్సరం మొత్తం దాదాపు 15,000 నియంత్రిత సంస్థలు, కంపెనీలలో 4వేల తనిఖీలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. ఇటీవల, యూఏఈ 2024-2027 సంవత్సరాలకు మనీలాండరింగ్, టెర్రరిజం ఫైనాన్సింగ్ను ఎదుర్కోవడానికి జాతీయ వ్యూహాన్ని ప్రారంభించింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి