ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్

- October 10, 2024 , by Maagulf
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు ఉందంటూ థ్రెటెనింగ్ మెయిల్స్ రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఎయిర్‌పోర్ట్‌ అధికారులు వెంటనే అలెర్ట్ అయి ఎయిర్‌పోర్ట్ మొత్తం బాంబు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. కోయంబత్తూరు – చెన్నై వయా హైదరాబాద్ వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది.

దాంతో హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా నిలిపివేశారు అధికారులు. ఆరు గంటలు చెక్ చేసిన తర్వాత ఏమీ లేదని ఊపిరి పీల్చుకున్నారు అధికారులు. ప్రయాణ సమయంలో ఇండిగో విమానంలో 181మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ సంఘటనపై అధికారులు విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com