రియాద్ సీజన్.. 2 నెలల్లో 10 మిలియన్ల మంది సందర్శకులు..!!
- December 08, 2024
రియాద్: రియాద్ సీజన్ 2024కి రికార్డు స్థాయిలో సందర్శకులు వచ్చారు. ప్రారంభమైన రెండు నెలల్లోనే 10 మిలియన్ల మంది సందర్శించారని జనరల్ ఎంటర్టైన్మెంట్ అథారిటీ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ టర్కీ అల్-షేక్ ప్రకటించారు. ప్రపంచంలో అతిపెద్ద ఎంటర్ టైన్ మెంట్ సీజన్లలో ఒకటైన రియాద్ సీజన్ అక్టోబర్ 12న ప్రారంభమైంది. లైవ్ కాన్సర్ట్ లు, ఆర్ట్ ఎగ్జిబిషన్లు, థియేట్రికల్ ప్రదర్శనలు, వినోద కార్యక్రమాలతో సహా వేలాది విభిన్న కార్యక్రమాలతో సందర్శకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
రియాద్ సీజన్ ఈవెంట్లలో 14 ఎంటర్టైన్మెంట్ జోన్లు, 11 ప్రపంచ ఛాంపియన్షిప్లు, 10 ఫెస్టివల్స్, ఎగ్జిబిషన్లతో పాటు 7.2 మిలియన్ చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. బాక్సింగ్ మ్యాచ్లు, రెజ్లింగ్, టెన్నిస్, కాన్సర్టులు, రెస్టారెంట్లు, గార్డెన్లు, కొత్త వినోద అనుభవాలతో రియాద్ సీజన్ ప్రముఖ వినోద గమ్యస్థానంగా మారింది. సీజన్లో ఐదు ప్రధాన జోన్లు బౌలేవార్డ్ వరల్డ్, కింగ్డమ్ అరేనా, బౌలేవార్డ్ సిటీ, ది వెన్యూ, అల్ సువైదీ పార్క్ సందర్శకులకు కొత్త అనుభవాన్ని అందిస్తున్నాయని టర్కీ అల్-షేక్ వెల్లడించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి