కంచి కామకోటి పీఠాధిపతిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన టీటీడీ చైర్మన్

- December 08, 2024 , by Maagulf
కంచి కామకోటి పీఠాధిపతిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన టీటీడీ చైర్మన్

తిరుమల: కంచి కామకోటి పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామీజీని టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు ఆదివారం సాయంత్రం తిరుమలలోని కంచి మఠంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు.ఈ సంద‌ర్భంగా స్వామీజీ చైర్మన్ ను ఆశీర్వ‌చ‌నం అందించారు.

ఈ సందర్భంగా స్వామీజీ చైర్మన్ తో మాట్లాడుతూ టీటీడీ నూతన ధర్మకర్తల మండలి ఇటీవల తీసుకున్న నిర్ణయాలను అభినందించారు. తిరుమల పవిత్రతను కాపాడే విధంగా, భక్తులకు మేలు చేకూరేలా నిర్ణయాలు తీసుకోవడం ప్రశంసనీయమని తెలిపారు. తిరుమలను మరింత సుందర దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని, వేదవిద్య వ్యాప్తికి కృషి చేయాలని చైర్మన్ కు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com