సౌదీ-యూఎస్ బిజినెస్ ఫోరమ్..మెగా ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు స్వాగతం..!!

- December 09, 2024 , by Maagulf
సౌదీ-యూఎస్ బిజినెస్ ఫోరమ్..మెగా ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు స్వాగతం..!!

రియాద్: సౌదీ ఛాంబర్స్ ఫెడరేషన్.. యూఎస్ సహకారంతో రియాద్ లో సౌదీ-యూఎస్ బిజినెస్ ఫోరం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ వాలిద్ అల్-అరైనన్, యూఎస్‌లోని డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ ఎంబసీ అలిసన్ దిల్‌వర్త్ మరియు రెండు దేశాల ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల ప్రతినిధులు పాల్గొన్నారు.

సౌదీ మార్కెట్‌లో ఎగుమతి అవకాశాలను అన్వేషించడానికి 72 అమెరికన్ కంపెనీలకు ఫోరమ్ స్వాగతం పలికింది. ఎనర్జీ, రవాణా, పర్యాటకం,  ఆరోగ్య సంరక్షణ రంగాలలో విస్తరించి ఉన్న కింగ్‌డమ్ విజన్ 2030 మెగా-ప్రాజెక్ట్‌లలో పెట్టుబడి అవకాశాలపై అవగాహన కల్పించారు.  ప్రత్యేక ప్రభుత్వ అభివృద్ధి నిధుల ద్వారా కింగ్‌డమ్ ఊహించిన $7 ట్రిలియన్ల వ్యయంపై ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు.  యూఎస్ ట్రేడ్ మిషన్ సందర్శన సౌదీ అరేబియాకు వినూత్నమైన అమెరికన్ ఎగుమతులు, ఉత్పత్తులు, సేవలను పరిచయం చేయడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది.  

2023లో సౌదీ అరేబియా - యునైటెడ్ స్టేట్స్ మధ్య వాణిజ్య మార్పిడి $34 బిలియన్లకు చేరుకుంది. ఇలాంటి ఫోరమ్‌లు ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని,  రెండు దేశాలలో ప్రభుత్వ / ప్రైవేట్ రంగాల మధ్య నిరంతర చర్చల ద్వారా సమగ్ర భాగస్వామ్యాన్ని పెంపొందించుకుంటాయని ఇరుపక్షాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com