హాస్పిటాలిటీ రంగంలో 22% ప్రభుత్వ రుసుములు తగ్గింపు..!!
- December 11, 2024
బురైదా: సౌదీ టూరిజం ఇన్వెస్ట్మెంట్ ఎనేబుల్స్ ప్రోగ్రాం హాస్పిటాలిటీ రంగంలో ప్రభుత్వ రుసుములను 22 శాతం తగ్గించేందుకు పని చేస్తుందని పర్యాటక మంత్రి అహ్మద్ అల్-ఖతీబ్ తెలిపారు. అల్-ఖాసిమ్ ప్రాంతంలో పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. పర్యాటక రంగంలో పెట్టుబడులకు అందుబాటులో ఉన్న అవకాశాలను అల్-ఖతీబ్ వెల్లడించారు.టూరిజం ఇన్వెస్ట్మెంట్ ఎనేబుల్స్ ప్రోగ్రాం అనేది పర్యాటక రంగంలో పెట్టుబడిదారులకు ప్రోత్సహించడానికి రూపొందించబడిన ప్రత్యేక కార్యక్రమని ఆయన పేర్కొన్నారు.
అల్-ఖతీబ్ అల్-ఖాసిమ్ రాజ్యంలో అత్యంత ప్రముఖమైన పర్యాటక ప్రదేశాలలో ఒకటి అని, దాని సహజ వైవిధ్యం, చారిత్రక వారసత్వ చరిత్ర కారణంగా పర్యాటక రంగంలో ఒక ప్రత్యేకత కలిగి ఉందన్నారు. పెట్టుబడులను ప్రోత్సహించడం, పెట్టుబడిదారులకు సౌకర్యాలు కల్పించడం మంత్రిత్వ శాఖ చేపడుతున్న ముఖ్యమైన కార్యక్రమాల్లో ఒకటని మంత్రి స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి