Dh1.5 మిలియన్ గోల్డ్ బహుమతులను గెలుచుకోండిలా..!!
- December 11, 2024
దుబాయ్: దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ 30వ ఎడిషన్లో భాగంగా దుబాయ్ జువెలరీ గ్రూప్ (డిజెజి) 1.5 మిలియన్ దిర్హామ్ల బంగారు బహుమతులను ప్రకటించింది. జనవరి 12, 2025 వరకు జరిగే దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ (DSF) సమయంలో అవుట్లెట్లలో ఆభరణాల కోసం Dh1,500 లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేసే కస్టమర్లు తమ వంతుగా 1.5 మిలియన్ దిర్హామ్ల బంగారాన్ని గెలుచుకునే అవకాశం ఉంది. ప్రతి వారం, రాఫిల్ డ్రాలలో 1 కిలోల బంగారం బహుమతిగా అందజేస్తారు. 20 మంది విజేతలు ఒక్కొక్కరికి 1/4 కిలోలు ఇవ్వనున్నారు. వీక్లీ డ్రాలు డిసెంబర్ 13, 20, 27, జనవరి 3, 12 తేదీలలో షెడ్యూల్ ఉంటాయి.
వీటితోపాటు ఎంపిక చేసిన వజ్రాలు, ముత్యాల ఆభరణాలపై 50 శాతం వరకు తగ్గింపు, ఎంపిక చేసిన బంగారు అభరణాలపై 1-5 శాతం మధ్య మేకింగ్ ఛార్జీల తగ్గింపు, పాత బంగారం ఎక్స్ఛేంజీలపై సున్నా వెయిటేజీ, ఎంపిక చేసిన కొనుగోళ్లతో ప్రత్యేక బహుమతులు అందుకోవచ్చు. 85కి పైగా ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్లు, 275 రిటైల్ జ్యువెలరీ అవుట్లెట్లు ప్రమోషన్లో భాగం అవుతున్నాయని దుబాయ్ జువెలరీ గ్రూప్లోని బోర్డ్ మెంబర్ & మార్కెటింగ్ కమిటీ చైర్పర్సన్ లైలా సుహైల్ వెల్లడించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి