యూఏఈలో మహిళా గ్యాంగ్స్టర్లకు జీవిత ఖైదు..!!
- January 03, 2025
యూఏఈ: దుబాయ్ క్రిమినల్ కోర్ట్ నలుగురు మహిళలతో కూడిన ఆఫ్రికన్ ముఠాకు జీవిత ఖైదు విధించింది. వారి శిక్షను అనుభవించిన తర్వాత దేశం నుండి బహిష్కరించాలని తన తీర్పులో ఆదేశించింది. ఈ ముఠా అక్రమంగా సైకోట్రోపిక్ పదార్థాలు, డ్రగ్స్ ను తీసుకొచ్చి అమ్మేవారని పోలీసులు కేసు నమోదు చేసారు. శిక్షాకాలం పూర్తయిన తర్వాత రెండేళ్లపాటు నేరుగా లేదా మధ్యవర్తుల ద్వారా ఇతరులకు డబ్బు బదిలీ చేయడం లేదా డిపాజిట్ చేయకుండా కోర్టు వారిని నిషేధించింది. బిజినెస్ బే ప్రాంతంలో ఈ ముఠా సభ్యులు సైకోట్రోపిక్ పదార్థాలు, డ్రగ్స్ అమ్ముతుండగా పోలీసులు రెడ్ హ్యాండెండ్ గా అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు డిపార్ట్మెంట్కు చెందిన బృందం ట్రాప్ను ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ఒక మహిళా పోలీసు అనుమానితుడితో కమ్యూనికేట్ చేసి, తాను సైకోట్రోపిక్ పదార్థాలను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు చెప్పిందని తెలిపారు. నిందితులు పేర్కొన్న రోజున, అతను మరో ఇద్దరు మహిళలు, వాహనం నడుపుతున్న ఒక వ్యక్తితో వచ్చి వారిని లొకేషన్ వద్ద పడేశాడు. 2,000 దిర్హామ్లకు బదులుగా మొదటి అనుమానితుడి నుండి నిషేధిత మందుల మాత్రల రూపంలో సైకోట్రోపిక్ పదార్థాలను అందుకున్నట్లు మహిళా పోలీసు విచారణలో పేర్కొంది.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







