లైసెన్స్ లేని లోన్ ప్రొవైడర్స్.. బహ్రెయిన్ ఇండియన్ ఎంబసీ వార్నింగ్..!!
- January 17, 2025
మనామా: బహ్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం కీలక వార్నింగ్ ను జారీ చేసింది. లైసెన్స్ లేని లోన్ ప్రొవైడర్స్ తో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. బహ్రెయిన్లోని కార్మికుల బృందం అదే జాతీయత కలిగిన వ్యక్తులకు అధిక వడ్డీ రేట్లతో రుణాలు అందిస్తూ అక్రమ బిజినెస్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ లోన్ ప్రొవైడర్స్ నేర కార్యకలాపాల నుండి వచ్చిన అక్రమ నిధులను ఉపయోగిస్తున్నారని నమ్ముతున్నట్లు ఎంబసీ పేర్కొంది. ఈ ఆందోళనల దృష్ట్యా, బహ్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం లైసెన్స్ పొందిన ఆర్థిక సంస్థల వెలుపలి మూలాల నుండి రుణాలు తీసుకోకుండా ఉండమని కమ్యూనిటీ సభ్యులను కోరింది. ఇటువంటి అనధికార రుణాలు వ్యక్తులను చట్టపరమైన పరిణామాలకు గురిచేయవచ్చని రాయబార కార్యాలయం తెలిపింది. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, చట్టబద్ధమైన మార్గాల ద్వారానే ఆర్థిక లావాదేవీలు నిర్వహించాలని భారతీయ పౌరులకు సూచించింది.
తాజా వార్తలు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ







