రేపటి నుంచి రాహుల్ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’
- January 13, 2024
న్యూ ఢిల్లీ: భారత్ జోడో యాత్రను విజయంతంగా పూర్తి చేసిన కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి పాదయాత్ర చేసేందుకు సిద్ధమైయ్యారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర పేరుతో మరో సారి పాదయాత్ర చేయనున్నారు. ఈ యాత్రను రేపు మణిపూర్ నుంచి రాహుల్ గాంధీ ప్రారంభించనున్నారు. భారత్ జోడో యాత్రకు (Jodo Yatra) కొనసాగింపుగా ఈ యాత్రను చేపట్టనున్నారు.
రేపు ప్రారంభం కానున్న ఈ యాత్ర మార్చి 20 వరకు కొనసాగనుంది. మణిపూర్ నుంచి ముంబై వరకు భారత్ న్యాయ యాత్ర జరగనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. ఈ యాత్ర 15 రాష్ట్రాలు, 110 జిల్లాలు, 100 లోక్సభ నియోజకవర్గాలు, 337 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ మార్చి 20న ముంబైలో ముగియనుంది.
రాహుల్ గాంధీ చేపట్టనున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర రేపు మణిపూర్ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అక్కడి మణిపూర్ బీజేపీ సర్కార్ షాక్ ఇచ్చింది. రాహుల్ చేపట్టే ఈ యాత్రకు అనుమతులు లేవని స్పష్టం చేసింది.మణిపూర్ అల్లర్లు, శాంతి భద్రతల దృష్ట్యా భారత న్యాయ యాత్రకు అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేసింది.
ఇంఫాల్ ఈస్ట్లోని చారిత్రక హప్తా కాంజీబంగ్ వేదికగా ప్రారంభోత్సవ వేడుక నిర్వహించేందుకు మణిపూర్ ప్రదేశ్ కాంగ్రెస్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రారంభ వేదికకు అనుమతి కోసం వారం రోజుల క్రితం చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు MPCC అధ్యక్షుడు కేశం మేఘచంద్ర. స్వయంగా ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ను కలిసి అనుమతి కోరారు. అయితే.. ఇంఫాల్ ప్యాలెస్ గ్రౌండ్లో వేదికకు అనుమతి ఇవ్వడం లేదని బీరెన్ సింగ్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
మరోవైపు అనుమతి నిరాకరణపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పందించారు. షెడ్యూల్ ప్రకారమే రాహుల్ గాంధీ భారత జోడో న్యాయ్ యాత్ర ప్రారంభమవుతుందన్నారు. ఎవరెన్ని చేసిన ఈ యాత్ర ప్రారంభాన్ని ఆపలేరని పేర్కొన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకోడానికి రాహుల్ గాంధీ ఈ యాత్ర చేపట్టారని ఆయన అన్నారు. ఈ యాత్రను ఆపేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. ఇదిలా ఉండగా రేపు రాహుల్ గాంధీ ప్రారంభించబోయే యాత్రాపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
తాజా వార్తలు
- అయోధ్య రామాలయ నిధుల స్కామ్ నిందితులు వీరే!
- ఖతార్లో నిల్వ ఉన్న ఇరాన్కు చెందిన 6 బిలియన్ డాలర్ల నిధులు విడుదల కానున్నాయి: ఇరాన్
- హైదరాబాద్-చెన్నై ఇక 2 గంటల్లోనే!
- కేతన్ అగర్వాల్ హత్య దర్యాప్తులో కొత్త విషయాలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!







