శబరిమలలో మకరజ్యోతి దర్శనం
- January 16, 2024
కేరళ: కేరళలోని శబరిమల కొండపై అయ్యప్ప భక్తులకు మకరజ్యోతి దర్శనమిచ్చింది. పొన్నాంబలమేడుపై మూడుసార్లు దర్శనమిచ్చింది. మకరజ్యోతి దర్శనంతో శరణు ఘోషతో శబరిగిరులు మార్మోగాయి. సంక్రాంతి రోజున ఈ దివ్య దర్శనం కోసం అయ్యప్ప భక్తులు లక్షల సంఖ్యలో వచ్చారు.
రవి ధనుస్సు రాశి నుంచి.. మకర రాశిలోకి ప్రవేశించే వేళ… ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవగా.. మకరజ్యోతి దర్శనమిచ్చింది. ఆ సమయంలో ఆ ప్రాంతమంతా భక్తులతో నిండిపోయింది. స్వామివారి దర్శనాల కోసం ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ప్రత్యేక ఏర్పాటు చేసింది.
కాగా, భక్తులకోసం ఆలయ అధికారులు కొన్ని రోజుల ముందు నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పంబానది, సన్నిధానం, హిల్ టాప్తో పాటు టోల్ ప్లాజా సమీపంలో అదనపు భద్రత ఉంది. భక్తుల రద్దీ నియంత్రణ కోసం దాదాపు వందలాది మంది పోలీసులు పనిచేశారు.
తాజా వార్తలు
- అయోధ్య రామాలయ నిధుల స్కామ్ నిందితులు వీరే!
- ఖతార్లో నిల్వ ఉన్న ఇరాన్కు చెందిన 6 బిలియన్ డాలర్ల నిధులు విడుదల కానున్నాయి: ఇరాన్
- హైదరాబాద్-చెన్నై ఇక 2 గంటల్లోనే!
- కేతన్ అగర్వాల్ హత్య దర్యాప్తులో కొత్త విషయాలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!







