రాఫిల్ డ్రా కుంభకోణం.. నెట్ వర్క్ ను ఛేదించిన అధికారులు..!!
- March 25, 2025
కువైట్: కువైట్ లో సంచలనం సృష్టించిన రాఫిల్ డ్రా కుంభకోణం కీలక మలుపు తిరిగింది. రాఫిల్ డ్రా కుంభకోణం వెనుక ఉన్న ఒక నెట్వర్క్ను ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితురాలు ఈజిప్షియన్ మహిళ, ఆమె భర్త 2023 నుండి వివిధ రాఫిల్లలో 7 వాహనాలను గెలుచుకున్నట్టు అధికారులు గుర్తించారు.
ప్రధాన నిందితురాలు అల్-నజాత్ ఛారిటీ కమిటీ ఉద్యోగి. ఈజిప్షియన్ ప్రవాసిని ఫాతిమా గమల్ సాద్ దియాబ్, బాబ్ అల్-కువైట్ ప్రెస్ కంపెనీ ఉద్యోగి అయిన ఆమె భర్త ముహమ్మద్ అబ్దుల్ సలాం ముహమ్మద్ అల్-ఘరబ్లి ఆదివారం సాయంత్రం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దేశం విడిచి పారిపోయే ప్రయత్నంలో ఉండగా అధికారులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారితోపాటు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని రాఫిల్ విభాగ అధిపతిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
అధికారిక నివేదికల ప్రకారం.. ఈ మోసపూరిత కార్యకలాపాలు 2023లో ప్రారంభమయ్యాయి. ఈ నెట్వర్క్లో భారతీయులు, ఆసియన్లు, ఈజిప్షియన్లు, స్థానిక పౌరులు సహా మరింత మంది వ్యక్తులు ఉన్నారని గుర్తించారు. ఈ డ్రాలో ఇప్పటివరకు ఏడు కార్లను ప్రదానం చేశారు. ఈ కేసులో నిందితులపై మోసం, ఫోర్జరీ, మనీలాండరింగ్, కువైట్ ఆర్థిక వ్యవస్థకు హాని కలిగించడం వంటి అనేక అభియోగాలను నమోదు చేశారు.
తాజా వార్తలు
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్