తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

- March 14, 2026 , by Maagulf
తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

చెన్నై: భారతీయ సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే జ్ఞానపీఠ్ అవార్డు ఈ ఏడాది తమిళ కవి ఆర్. వైరముత్తును వరించింది. 2025 సంవత్సరానికి గాను (60వ జ్ఞానపీఠ్) ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు శనివారం (మార్చి 14) భారతీయ జ్ఞానపీఠ్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ప్రముఖ రచయిత్రి ప్రతిభా రే నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ వైరముత్తు పేరును ఖరారు చేసింది.

వైరముత్తు తన కెరీర్‌లో ఇప్పటికే ఎన్నో ఉన్నత పురస్కారాలు అందుకున్నారు. ఏడుసార్లు ఉత్తమ గీత రచయితగా జాతీయ అవార్డును గెలుచుకున్నారు. భారత ప్రభుత్వం ఆయనను 2003లో పద్మశ్రీ, 2014లో పద్మభూషణ్‌తో సత్కరించింది. ఆయన రాసిన ‘కళ్ళికాట్టు ఇతిహాసం’ నవలకు సాహిత్య అకాడమీ పురస్కారం కూడా లభించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com