షేక్ జాయెద్ రోడ్డులో 'నిమిషాల్లోనే' డ్రైవర్ను రక్షించిన పోలీసులు..!!
- June 22, 2025
దుబాయ్: షేక్ జాయెద్ రోడ్డులో క్రూయిజ్ కంట్రోల్ అనుకోకుండా పనిచేయకపోవడంతో ఇబ్బందుల్లో పడ్డ డ్రైవర్ను దుబాయ్ పోలీసు ట్రాఫిక్ పెట్రోలింగ్ వేగంగా స్పందించి రక్షించిందని అధికారులు తెలిపారు. “షేక్ జాయెద్ రోడ్డులో అబుదాబి వైపు స్థిరమైన వేగంతో ప్రయాణిస్తున్న వాహనం గురించి (మా) ఆపరేషన్స్ గదికి నివేదిక అందింది. క్రూయిజ్ కంట్రోల్ పనిచేయకపోవడం వల్ల మహిళా డ్రైవర్ తిరిగి నియంత్రణ పొందలేకపోయారు.” అని దుబాయ్ పోలీసుల ట్రాఫిక్ జనరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మేజర్ జనరల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రౌయి అన్నారు.
నివేదిక అందిన కొద్ది నిమిషాలకే, ట్రాఫిక్ గస్తీ బృందాలను వెంటనే ఆ ప్రదేశానికి తరలివెళ్లాయని, నాల్గవ లేన్లో ప్రయాణిస్తున్న వాహనాన్ని గుర్తించారని తెలిపారు. “వారు మహిళా డ్రైవర్కు ఫోన్ కాల్స్, ప్రత్యక్ష సూచనల ద్వారా మార్గనిర్దేశం చేస్తూ జాగ్రత్తగా ఎస్కార్ట్ను సమన్వయం చేసుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఆమె ఇతరుల భద్రతను నిర్ధారించడానికి అవసరమైన చర్యలను ఆమెకు తెలియజేసారు." అని ఆయన వివరించారు.
ఒక గస్తీ బృందం వాహనం ముందు స్థానంలో నిలిచి, క్రమంగా దానిని ఆపివేసిందని అల్ మజ్రౌయి వివరించారు. అంతుకుమందు వాహనం ముందు, వెనుక సురక్షితమైన కారిడార్ను సృష్టించాయని తెలిపారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ బృందాలను ఆయన ప్రశంసించారు. డ్రైవర్లు క్రమం తప్పకుండా వాహన తనిఖీలు నిర్వహించాలని, బ్రేక్లు, క్రూయిజ్ కంట్రోల్ వంటి కీలకమైన వ్యవస్థల భద్రతను నిర్ధారించుకోవాలని ఆయన కోరారు.
క్రూయిజ్ కంట్రోల్ ఫెయిల్ అయిన సందర్భాల్లో పాటించాల్సిన సూచనలు..
-సమస్య తలెత్తగానే ప్రశాంతంగా ఉండాలి. భయపడవద్దు.
-మీ హజార్డ్ లైట్లు, హెడ్లైట్లను ఆన్ చేయండి.
-అత్యవసర నంబర్ 999కి కాల్ చేసి పరిస్థితిని వివరించాలి.
-మీ ట్రాన్స్మిషన్ను Nకి మార్చాలి.
-ఇంజిన్ను ఆపివేసి వెంటనే దాన్ని పునఃప్రారంభించాలి.
-మునుపటి దశలు పని చేయకపోతే, కారు ఆగిపోయే వరకు నిరంతరం బ్రేక్లను వేస్తూనే ఉండాలి.
-వాహనం ఆగకపోతే, నియంత్రణను నిర్వహించడానికి స్టీరింగ్ వీల్ను గట్టిగా పట్టుకుని హ్యాండ్బ్రేక్ను క్రమంగా విడుదల చేయాలి.
-మునుపటి పద్ధతులు విఫలమైతే, N మరియు D మధ్య ట్రాన్స్మిషన్ను మార్చడం కొనసాగించాలి.
-పోలీసులు రాకముందే మీరు నియంత్రణను తిరిగి పొందగలిగిన తర్వాత, మీ వాహనాన్ని రోడ్డు నుండి సురక్షితంగా తరలించాలి.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







