షేక్ జాయెద్ రోడ్డులో 'నిమిషాల్లోనే' డ్రైవర్ను రక్షించిన పోలీసులు..!!
- June 22, 2025
దుబాయ్: షేక్ జాయెద్ రోడ్డులో క్రూయిజ్ కంట్రోల్ అనుకోకుండా పనిచేయకపోవడంతో ఇబ్బందుల్లో పడ్డ డ్రైవర్ను దుబాయ్ పోలీసు ట్రాఫిక్ పెట్రోలింగ్ వేగంగా స్పందించి రక్షించిందని అధికారులు తెలిపారు. “షేక్ జాయెద్ రోడ్డులో అబుదాబి వైపు స్థిరమైన వేగంతో ప్రయాణిస్తున్న వాహనం గురించి (మా) ఆపరేషన్స్ గదికి నివేదిక అందింది. క్రూయిజ్ కంట్రోల్ పనిచేయకపోవడం వల్ల మహిళా డ్రైవర్ తిరిగి నియంత్రణ పొందలేకపోయారు.” అని దుబాయ్ పోలీసుల ట్రాఫిక్ జనరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మేజర్ జనరల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రౌయి అన్నారు.
నివేదిక అందిన కొద్ది నిమిషాలకే, ట్రాఫిక్ గస్తీ బృందాలను వెంటనే ఆ ప్రదేశానికి తరలివెళ్లాయని, నాల్గవ లేన్లో ప్రయాణిస్తున్న వాహనాన్ని గుర్తించారని తెలిపారు. “వారు మహిళా డ్రైవర్కు ఫోన్ కాల్స్, ప్రత్యక్ష సూచనల ద్వారా మార్గనిర్దేశం చేస్తూ జాగ్రత్తగా ఎస్కార్ట్ను సమన్వయం చేసుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఆమె ఇతరుల భద్రతను నిర్ధారించడానికి అవసరమైన చర్యలను ఆమెకు తెలియజేసారు." అని ఆయన వివరించారు.
ఒక గస్తీ బృందం వాహనం ముందు స్థానంలో నిలిచి, క్రమంగా దానిని ఆపివేసిందని అల్ మజ్రౌయి వివరించారు. అంతుకుమందు వాహనం ముందు, వెనుక సురక్షితమైన కారిడార్ను సృష్టించాయని తెలిపారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ బృందాలను ఆయన ప్రశంసించారు. డ్రైవర్లు క్రమం తప్పకుండా వాహన తనిఖీలు నిర్వహించాలని, బ్రేక్లు, క్రూయిజ్ కంట్రోల్ వంటి కీలకమైన వ్యవస్థల భద్రతను నిర్ధారించుకోవాలని ఆయన కోరారు.
క్రూయిజ్ కంట్రోల్ ఫెయిల్ అయిన సందర్భాల్లో పాటించాల్సిన సూచనలు..
-సమస్య తలెత్తగానే ప్రశాంతంగా ఉండాలి. భయపడవద్దు.
-మీ హజార్డ్ లైట్లు, హెడ్లైట్లను ఆన్ చేయండి.
-అత్యవసర నంబర్ 999కి కాల్ చేసి పరిస్థితిని వివరించాలి.
-మీ ట్రాన్స్మిషన్ను Nకి మార్చాలి.
-ఇంజిన్ను ఆపివేసి వెంటనే దాన్ని పునఃప్రారంభించాలి.
-మునుపటి దశలు పని చేయకపోతే, కారు ఆగిపోయే వరకు నిరంతరం బ్రేక్లను వేస్తూనే ఉండాలి.
-వాహనం ఆగకపోతే, నియంత్రణను నిర్వహించడానికి స్టీరింగ్ వీల్ను గట్టిగా పట్టుకుని హ్యాండ్బ్రేక్ను క్రమంగా విడుదల చేయాలి.
-మునుపటి పద్ధతులు విఫలమైతే, N మరియు D మధ్య ట్రాన్స్మిషన్ను మార్చడం కొనసాగించాలి.
-పోలీసులు రాకముందే మీరు నియంత్రణను తిరిగి పొందగలిగిన తర్వాత, మీ వాహనాన్ని రోడ్డు నుండి సురక్షితంగా తరలించాలి.
తాజా వార్తలు
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO
- ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై కువైట్ ఫోకస్..!!
- దుబాయ్లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్







