ఇరాన్ సంచలన నిర్ణయం.. హర్మూజ్ జలసంధి మూసివేత..!
- June 23, 2025
అణు స్థావరాలపై దాడులతో రగిలిపోతున్న ఇరాన్ ప్రతీకార చర్యగా హర్మూజ్ జలసంధి మూసివేతకు నిర్ణయం తీసుకుంది. హర్మూజ్ జలసంధి మూసివేతకు ఇరాన్ పార్లమెంట్ తీర్మానం చేసింది. ఇరాన్ నిర్ణయంతో చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. హర్మూజ్ జల సంధి ద్వారానే ప్రపంచవ్యాప్తంగా 20శాతం క్రూడాయిల్ సప్లయ్ జరుగుతోంది. భారత్ చమురు దిగుబడులకు ఈ జల సంధి అత్యంత కీలకమైనది. ఇరాన్ నిర్ణయంతో ప్రత్యామ్నాయాలపై భారత్ ఫోకస్ పెట్టింది. అమెరికా, రష్యా నుంచి చమురు దిగుమతికి భారత్ సన్నాహాలు చేస్తోంది.
ఇరాన్, ఒమన్ మధ్య 33 కిలోమీటర్ల పరిధిలో ఇరుకైన పాయింట్ లో ఉన్న ఈ హర్మూజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్ ను, గల్ఫ్ ఆఫ్ ఒమన్ ను అరేబియా సముద్రంతో కలుపుతుంది. గల్ఫ్ లో ఉన్న సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఇరాక్, ఖతార్ వంటి ఇంధన ఉత్పత్తి దేశాలు ఆయిల్ ను ఎగుమతి చేసేందుకు అనువుగా ఉన్న ఏకైక సముద్ర మార్గం హర్మూజ్ జలసంధి మాత్రమే.

ప్రస్తుతం ఈ ఒక్క చెక్ పాయింట్ ద్వారానే ప్రపంచవ్యాప్తంగా 20శాతం ఇంధనం సరఫరా అవుతోంది. ఈ హర్మూజ్ జలసంధి ప్రాంతంలోని చాలా ద్వీపాలు ప్రస్తుతం ఇరాన్ ఆధీనంలోనే ఉన్నాయి. హర్మూజ్ జలసంధి మూసివేత భారత్, చైనాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ హర్మూజ్ జలసంధి గుండా వెళ్లేటువంటి చమురు ఎగుమతుల్లో 82శాతం ఆసియా దేశాలకు వెళ్తున్నాయి.
వీటిలో భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా దేశాలకే ఏకంగా 67శాతం వెళ్తోంది. భారత ముడి చమురులో 90శాతం మిడిల్ ఈస్ట్ దేశాల నుంచే దిగుమతి అవుతుంది. ఇందులో 40శాతం హర్మూజ్ జలసంధి నుంచే వస్తుండటంతో ఇది భారత్ కు ఎంతో కీలకం. హర్మూజ్ జలసంధి మూసివేతతో అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరగనున్నాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. భారత్ కు అవసరమైన చమురు దిగుమతుల్లో 45 నుంచి 50శాతం, సహజవాయువు దిగుమతుల్లో 60శాతం ఈ మార్గం నుంచే వస్తుంది.
ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయెల్ వివాదం కారణంగా గ్లోబల్ మార్కెట్ లో చమురు ధరలు బ్యారెల్ కు 65 డాలర్ల నుంచి 70 డాలర్లకు పెరిగింది. ఈ జల సంధి మూసివేతతో ఆ ధర 90 డాలర్లకు పైగా పెరుగుతుందని నిపుణులు అంచనా వేశారు. అధిక ముడిచమురు ధరలు ఆయిల్ కంపెనీలను నేరుగా ప్రభావితం చేస్తాయని నిపుణులు తెలిపారు. ఇక భారత చమురు దిగుమతి బిల్లు 14 బిలియన్ డాలర్లపైనే పడుతుందని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







