తొమ్మిది మంది ఇస్లామిక్ ఉగ్రవాదులు హతమయ్యారు

- July 25, 2016 , by Maagulf
తొమ్మిది మంది ఇస్లామిక్ ఉగ్రవాదులు హతమయ్యారు

బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఢాకాలోని ఓ భవనాన్ని ముట్టడించిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న భద్రతా బలగాలు వారిపై కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో 9మంది ఉగ్రవాదులు మృతిచెందారు. వీరంతా అనుమానిత ఐఎస్‌ ఉగ్రవాదులుగా భావిస్తున్నారు. ఈ ఘటనను ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ (డీఎంపీ) మసూద్ అహ్మద్ ధ్రువీకరించారు. రెండు గంటలసేపు జరిగిన ఎదురెదురు కాల్పుల్లో తొమ్మిది మంది ఇస్లామిక్ ఉగ్రవాదులు హతమయ్యారని, ఒకరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. కల్యాణ్‌పూర్ సమీపంలో ఉగ్రవాదులు ఒక భవంతి నుంచి బాంబులు విసురుతుండగా చుట్టుముట్టామని, రాత్రి నుంచి ఎదురెదురు కాల్పులు జరిగాయని చెప్పారు. ఇస్లామిక్ సాయుధులు కాల్పులు జరుపుతూ మధ్యమధ్యలో అల్లాహో అక్బర్ ఉంటూ నినాదాలు చేసినట్టు చెప్పారు. ఆపరేషన్ స్టార్ 26 పేరుతో సాయుధపోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సమర్ధవంతంగా ఉగ్రవాదులను మట్టుపెట్టినట్టు ఢాకా అడిషనల్ పోలీస్ కమిషనర్ షేక్ మరుఫ్ హసన్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com