తొమ్మిది మంది ఇస్లామిక్ ఉగ్రవాదులు హతమయ్యారు
- July 25, 2016
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఢాకాలోని ఓ భవనాన్ని ముట్టడించిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న భద్రతా బలగాలు వారిపై కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో 9మంది ఉగ్రవాదులు మృతిచెందారు. వీరంతా అనుమానిత ఐఎస్ ఉగ్రవాదులుగా భావిస్తున్నారు. ఈ ఘటనను ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ (డీఎంపీ) మసూద్ అహ్మద్ ధ్రువీకరించారు. రెండు గంటలసేపు జరిగిన ఎదురెదురు కాల్పుల్లో తొమ్మిది మంది ఇస్లామిక్ ఉగ్రవాదులు హతమయ్యారని, ఒకరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. కల్యాణ్పూర్ సమీపంలో ఉగ్రవాదులు ఒక భవంతి నుంచి బాంబులు విసురుతుండగా చుట్టుముట్టామని, రాత్రి నుంచి ఎదురెదురు కాల్పులు జరిగాయని చెప్పారు. ఇస్లామిక్ సాయుధులు కాల్పులు జరుపుతూ మధ్యమధ్యలో అల్లాహో అక్బర్ ఉంటూ నినాదాలు చేసినట్టు చెప్పారు. ఆపరేషన్ స్టార్ 26 పేరుతో సాయుధపోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సమర్ధవంతంగా ఉగ్రవాదులను మట్టుపెట్టినట్టు ఢాకా అడిషనల్ పోలీస్ కమిషనర్ షేక్ మరుఫ్ హసన్ తెలిపారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







