సినీ పరిశ్రమను పట్టించుకోవడం మానేశా: మంత్రి కోమటిరెడ్డి
- January 10, 2026
హైదరాబాద్: తెలంగాణలో సినిమా టిక్కెట్ ధరల పెంపు అంశంపై రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు.. సినిమా టిక్కెట్ ధరల పెంపునకు తాను ఎప్పుడూ అనుమతి ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. పుష్ప-2 తర్వాత ఎప్పుడూ ధరల పెంపునకు అనుమతి ఇవ్వలేదని ఆయన తేల్చి చెప్పారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సినిమా టిక్కెట్ ధరల పెంపు అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. మీడియా ప్రతినిధుల ప్రశ్నకు సమాధానమిస్తూ, తాను సినిమా పరిశ్రమ వ్యవహారాలను పట్టించుకోవడం మానివేశానని ఆయన అన్నారు. టిక్కెట్ ధరల పెంపు గురించి వస్తున్న జీవోలకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’ చిత్రానికి సంబంధించి టిక్కెట్ ధరలు పెంచుకోవడానికి అర్ధరాత్రి సమయంలో జీవో వచ్చినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై విధంగా స్పందించారు.
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







