సినీ పరిశ్రమను పట్టించుకోవడం మానేశా: మంత్రి కోమటిరెడ్డి
- January 10, 2026
హైదరాబాద్: తెలంగాణలో సినిమా టిక్కెట్ ధరల పెంపు అంశంపై రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు.. సినిమా టిక్కెట్ ధరల పెంపునకు తాను ఎప్పుడూ అనుమతి ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. పుష్ప-2 తర్వాత ఎప్పుడూ ధరల పెంపునకు అనుమతి ఇవ్వలేదని ఆయన తేల్చి చెప్పారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సినిమా టిక్కెట్ ధరల పెంపు అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. మీడియా ప్రతినిధుల ప్రశ్నకు సమాధానమిస్తూ, తాను సినిమా పరిశ్రమ వ్యవహారాలను పట్టించుకోవడం మానివేశానని ఆయన అన్నారు. టిక్కెట్ ధరల పెంపు గురించి వస్తున్న జీవోలకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’ చిత్రానికి సంబంధించి టిక్కెట్ ధరలు పెంచుకోవడానికి అర్ధరాత్రి సమయంలో జీవో వచ్చినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై విధంగా స్పందించారు.
తాజా వార్తలు
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!
- జెడ్డాలో 1,480 మంది పౌరులకు భూమి పత్రాలు అందజేత..!!
- ఖతార్ సైంటిఫిక్ క్లబ్ ‘యంగ్ ఇన్వెంటర్స్’ ప్రారంభం..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు పసికందులు సజీవ దహనం
- ఫస్ట్, బిజినెస్ క్లాస్ టికెట్లపై రూమర్స్.. ఖండించిన కువైట్ ఎయిర్వేస్..!!







