'జెట్ ఎయిర్వేస్' వారి స్పెషల్ ఆఫర్
- July 20, 2015
దేశీయ రూట్లలో.. అక్టోబర్ 15 వరకూ ముంబై: జెట్ ఎయిర్వేస్ సంస్థ దేశీయ రూట్లలో స్పెషల్ చార్జీలను ఆఫర్ చేస్తోంది. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 15 వరకూ ఈ స్పెషల్ ఆఫర్లు వర్తిస్తాయని కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ రాజ్ శివ్కుమార్ చెప్పారు. 750 కిమీ, లోపు దూరమున్న రూట్లలో ఈ స్పెషల్ చార్జీలు రూ.6,999 నుంచి, 750 నుంచి 1,000 కిమీ. దూరమున్న రూట్లలో చార్జీలు రూ.8,999 నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. దేశీ నెట్వర్క్లోని తమ అన్ని విమాన సర్వీసులకు ఈ స్పెషల్ చార్జీలు వర్తిస్తాయని వివరించారు. డెరైక్ట్, వయా ఫ్లైట్లకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపారు. వ్యక్తిగత సర్వీసులతో పాటు మల్టీ-కోర్స్ మీల్ ఆప్షన్లను కూడా అందిస్తున్నామన్నారు. ఇక 1,000 కిమీ. పైబడి దూరమున్న విమాన రూట్లకు సంబంధించిన చార్జీలపై 20% డిస్కౌంట్నిస్తున్నట్లు శివ్కుమార్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







