కర్ణాటకలో విదేశీ మహిళ పై దాడి

- April 23, 2026 , by Maagulf
కర్ణాటకలో విదేశీ మహిళ పై దాడి

బెంగళూరు: కర్ణాటకలోని కొడగు జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అమెరికాకు చెందిన ఓ మహిళ తనపై అత్యాచారం జరిగిందని ఆరోపించడంతో ఈ కేసు సంచలనం రేపుతోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కుట్టా గ్రామంలోని ఒక హోమ్‌స్టేలో బస చేసిన ఆ విదేశీ మహిళపై అక్కడ పనిచేసే వృజేష్‌కుమార్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ ఘటన బయటకు రాకుండా ఉండేందుకు నిందితుడు హోమ్‌స్టేలోని వైఫైను మూడు రోజుల పాటు ఆఫ్ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా బాధితురాలికి మత్తుమందు ఇచ్చి, ఎవరితోనూ సంప్రదించకుండా అడ్డుకున్నాడని పోలీసులు తెలిపారు.

ఎట్టకేలకు అక్కడి నుంచి తప్పించుకున్న బాధితురాలు మైసూరుకు చేరుకుని అమెరికా ఎంబసీకి ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు ఆధారంగా అధికారులు వెంటనే చర్యలు ప్రారంభించారు.

కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడితో పాటు హోమ్‌స్టే యజమానిని కూడా అరెస్టు చేశారు. కోర్టు వారిని జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com