కర్ణాటకలో విదేశీ మహిళ పై దాడి
- April 23, 2026
బెంగళూరు: కర్ణాటకలోని కొడగు జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అమెరికాకు చెందిన ఓ మహిళ తనపై అత్యాచారం జరిగిందని ఆరోపించడంతో ఈ కేసు సంచలనం రేపుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కుట్టా గ్రామంలోని ఒక హోమ్స్టేలో బస చేసిన ఆ విదేశీ మహిళపై అక్కడ పనిచేసే వృజేష్కుమార్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ ఘటన బయటకు రాకుండా ఉండేందుకు నిందితుడు హోమ్స్టేలోని వైఫైను మూడు రోజుల పాటు ఆఫ్ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా బాధితురాలికి మత్తుమందు ఇచ్చి, ఎవరితోనూ సంప్రదించకుండా అడ్డుకున్నాడని పోలీసులు తెలిపారు.
ఎట్టకేలకు అక్కడి నుంచి తప్పించుకున్న బాధితురాలు మైసూరుకు చేరుకుని అమెరికా ఎంబసీకి ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు ఆధారంగా అధికారులు వెంటనే చర్యలు ప్రారంభించారు.
కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడితో పాటు హోమ్స్టే యజమానిని కూడా అరెస్టు చేశారు. కోర్టు వారిని జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!







