కర్ణాటకలో విదేశీ మహిళ పై దాడి
- April 23, 2026
బెంగళూరు: కర్ణాటకలోని కొడగు జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అమెరికాకు చెందిన ఓ మహిళ తనపై అత్యాచారం జరిగిందని ఆరోపించడంతో ఈ కేసు సంచలనం రేపుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కుట్టా గ్రామంలోని ఒక హోమ్స్టేలో బస చేసిన ఆ విదేశీ మహిళపై అక్కడ పనిచేసే వృజేష్కుమార్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ ఘటన బయటకు రాకుండా ఉండేందుకు నిందితుడు హోమ్స్టేలోని వైఫైను మూడు రోజుల పాటు ఆఫ్ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా బాధితురాలికి మత్తుమందు ఇచ్చి, ఎవరితోనూ సంప్రదించకుండా అడ్డుకున్నాడని పోలీసులు తెలిపారు.
ఎట్టకేలకు అక్కడి నుంచి తప్పించుకున్న బాధితురాలు మైసూరుకు చేరుకుని అమెరికా ఎంబసీకి ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు ఆధారంగా అధికారులు వెంటనే చర్యలు ప్రారంభించారు.
కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడితో పాటు హోమ్స్టే యజమానిని కూడా అరెస్టు చేశారు. కోర్టు వారిని జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
తాజా వార్తలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!
- స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్లో పాస్పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..









