వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- May 01, 2026
విశాఖపట్నం: సరసమైన ధరలకే ఆహారాన్ని అందించే ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ ‘టోయింగ్’ (Toing) ఇప్పుడు విశాఖపట్నం (వైజాగ్) మార్కెట్లోకి అధికారికంగా ప్రవేశించింది. సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నంలో ఆహార ప్రియులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు ‘టోయింగ్’ సిద్ధమైంది. 2025 సెప్టెంబర్లో ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ యాప్, కేవలం 7 నెలల కాలంలోనే దేశవ్యాప్తంగా 35 ప్రధాన నగరాలకు విస్తరించడం విశేషం. ముఖ్యంగా కళాశాల విద్యార్థులు, యువ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని వైజాగ్లో ఈ సేవలను ప్రారంభించారు. రెస్టారెంట్ టేబుల్ మెనూ ధరలకే లేదా అంతకంటే తక్కువ ధరలకే ఆహారాన్ని డెలివరీ చేస్తామని కంపెనీ హామీ ఇస్తోంది. బిర్యానీలు, బర్గర్లు వంటి వివిధ వంటకాలను రూ. 99 కంటే తక్కువ ప్రారంభ ధరలకే ఈ యాప్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇతర ఫుడ్ యాప్లతో పోలిస్తే టోయింగ్ ప్రత్యేకంగా నిలవడానికి ప్రధాన కారణం దాని ధరల విధానం. ఏ ఆర్డర్పై కూడా అదనపు ప్యాకేజింగ్ ఛార్జీలు వసూలు చేయకపోవడంతో పాటు, ప్లాట్ఫాం ఫీజును కూడా పూర్తిగా మినహాయించారు. వైజాగ్లోని ప్రముఖ రెస్టారెంట్లు అయిన సత్యం మల్టిక్యూజిన్, బాంబే రెస్టారెంట్, హైదరాబాద్ బావర్చి, పారడైజ్, మెక్డొనాల్డ్స్ వంటి టాప్ బ్రాండ్లతో టోయింగ్ ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకుంది. దక్షిణ భారత, ఉత్తర భారత వంటకాలతో పాటు చైనీస్, పిజ్జాలు, డెజర్ట్లు వంటి విస్తృత శ్రేణి ఎంపికలను కస్టమర్లకు అందుబాటులో ఉంచింది.
టోయింగ్ యాప్ ఇప్పటికే దేశవ్యాప్తంగా 4.5 మిలియన్లకు పైగా డౌన్లోడ్స్ను సొంతం చేసుకోవడమే కాకుండా, ప్లేస్టోర్లో 4.5 రేటింగ్తో అత్యంత నమ్మకమైన యాప్గా పేరు పొందింది. ఈ విస్తరణ గురించి టోయింగ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సిద్ధార్థ భాకూ మాట్లాడుతూ.. జెన్-జీ (Gen Z) మరియు విద్యా కేంద్రాల్లోని విద్యార్థుల అవసరాలను తీర్చడమే తమ ప్రాథమిక లక్ష్యమని తెలిపారు. పూణేలో ప్రారంభమై ముంబయి, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల మీదుగా ఇప్పుడు వైజాగ్కు చేరుకున్న ఈ యాప్, సామాన్యుడికి కూడా ఫుడ్ డెలివరీని చేరువ చేస్తూ మార్కెట్లో బలమైన పోటీదారుగా ఎదుగుతోంది.
తాజా వార్తలు
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!







