BRICS దేశాల విదేశాంగ మంత్రులతో భారత్ చర్చలు
- May 14, 2026
న్యూఢిల్లీ: బ్రిక్స్ (BRICS) దేశాల విదేశాంగ మంత్రులు మరియు ప్రతినిధి బృందాల నేతలతో సమావేశమైన సందర్భంగా భారత్ తన కట్టుబాటును మరోసారి స్పష్టం చేసింది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల మధ్య సహకారాన్ని పెంపొందించడంలో, అలాగే గ్లోబల్ సౌత్ ఆశయాలకు స్వరం అందించడంలో బ్రిక్స్ ఒక కీలక వేదికగా ఎదిగిందని పేర్కొంది.
ఈ ఏడాది భారత్ బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో, బహుపాక్షిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడం, ఆర్థిక స్థైర్యాన్ని పెంపొందించడం మరియు సమగ్ర ప్రపంచ వ్యవస్థ నిర్మాణానికి కలిసి పనిచేస్తామని భారత్ తెలిపింది.
సమావేశంలో సభ్య దేశాల మధ్య పరస్పర సహకారం, వాణిజ్యం, ఆర్థిక అభివృద్ధి, అంతర్జాతీయ అంశాల పై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.
తాజా వార్తలు
- ఇంధన పొదుపు, విదేశీ మారకద్రవ్యం ఆదాకు ప్రజలు సహకరించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- BRICS దేశాల విదేశాంగ మంత్రులతో భారత్ చర్చలు
- ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..వారానికి ఒక రోజు ‘నో వెహికిల్ డే’!
- ఛార్ధామ్ యాత్ర మొదలైన 26 రోజుల్లోనే 38 మంది భక్తులు మృతి
- సౌదీ అరేబియాలో 19 మందికి జరిమానాలు..!!
- ఇది మరో కోవిడ్-19 కాదు.. హంటావైరస్ భయాలపై వైద్యుల క్లారిటీ..!!
- రోడ్డుపై వాహనాలు నిలిపివేయొద్దు.. ప్రాణాపాయం తప్పదని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ద్వైపాక్షిక సహకారంపై ఒమన్, టర్కీ చర్చలు..!!
- బహ్రెయిన్ లో పార్లమెంట్ ఉప ఎన్నికలపై కీలక ప్రకటన..!!
- ఖతార్ రియల్ ఎస్టేట్ లావాదేవీలు రెట్టింపు..!!









