ఛార్ధామ్ యాత్ర మొదలైన 26 రోజుల్లోనే 38 మంది భక్తులు మృతి
- May 14, 2026
ఉత్తరాఖండ్లో ఎంతో ఘనంగా జరిగే ఛార్ధామ్ యాత్రలో విషాదం నెలకొంది. యాత్ర మొదలైన 26 రోజుల్లోనే మొత్తం 38 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. ఏప్రిల్ 19న ప్రారంభమైన ఈ పవిత్ర యాత్రకు భక్తులు పోటెత్తారు. కానీ మారుతున్న వాతావరణం, ఆరోగ్య సమస్యల వల్ల యాత్రికులు ప్రాణాలు విడుస్తున్నారు. భక్తులు తమ ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం హెచ్చరిస్తోంది.
క్షేత్రాల వారీగా మరణాల వివరాలు ఈ ఏడాది యాత్రలో కేదార్నాథ్ క్షేత్రంలో అత్యధికంగా 21 మంది చనిపోయారు. బద్రీనాథ్లో ఏడుగురు, గంగోత్రి అలాగే యమునోత్రిలలో ఐదుగురు చొప్పున భక్తులు మరణించారు. చలి తీవ్రత పెరగడం, ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం వల్ల యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులే ఈ మరణాలకు ప్రధాన కారణాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
పెరుగుతున్న భక్తుల రద్దీ–భద్రతా ఏర్పాట్లు
ప్రమాదాలు జరుగుతున్నా భక్తుల తాకిడి మాత్రం తగ్గడం లేదు. బుధవారం సాయంత్రం సమయానికి సుమారు 11.81 లక్షల మంది స్వామివారిని దర్శించుకున్నారు. యాత్రకు వచ్చే వారు వయసు, పాత జబ్బులను దృష్టిలో ఉంచుకుని ప్లాన్ చేసుకోవాలి. కొండ ప్రాంతాల్లో నడిచేటప్పుడు అలసట రాకుండా తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. భక్తుల కోసం క్షేత్రాల వద్ద వైద్య సదుపాయాలను అధికారులు అధికం చేసారు
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్వేస్తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్







