ఈద్ అల్ అధా శుభాకాంక్షలు తెలుపుకున్న యూఏఈ అధ్యక్షుడు, ఒమాన్ సుల్తాన్
- May 25, 2026
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు హిజ్ హైనెస్ షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరియు ఒమాన్ సుల్తానేట్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ ఈద్ అల్ అధా సందర్భంగా ఫోన్లో పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఈ సందర్భంగా రెండు దేశాలు, ప్రజలు సుఖసంతోషాలతో అభివృద్ధి చెందాలని, ప్రపంచవ్యాప్తంగా శాంతి, భద్రత, సౌభాగ్యం నెలకొనాలని ఇద్దరు నేతలు ప్రార్థించారు.
అలాగే యూఏఈ, ఒమాన్ దేశాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలు, ద్వైపాక్షిక సహకారంపై కూడా చర్చించారు. పరస్పర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రెండు దేశాల మధ్య బంధాలను మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని నేతలు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







