మొదలుకానున్న ఫిఫా వరల్డ్ కప్ 2026 హంగామా
- June 11, 2026
ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఫుట్బాల్ అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న మహా సంగ్రామం, ‘ఫిఫా వరల్డ్ కప్ 2026’ (FIFA World Cup 2026) నేటి నుంచే అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈసారి టోర్నమెంట్లో సరికొత్త ఫార్మాట్తో పాటు విజేతలకు అందించే ప్రైజ్ మనీ విషయంలో కూడా ఫిఫా సరికొత్త చరిత్రను సృష్టించబోతోంది. ఫిఫా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈసారి టోర్నమెంట్ కోసం భారీ బహుమతి మొత్తాన్ని కేటాయించారు. ఈ 2026 మెగా టోర్నీలో ఛాంపియన్గా నిలిచే జట్టుకు ఏకంగా 48 మిలియన్ డాలర్లు బహుమతిగా లభించనున్నాయి. మన భారతీయ కరెన్సీలో దీని విలువ సుమారు రూ. 416 కోట్లు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్పోర్ట్స్ టోర్నమెంట్గా ఈసారి ఫిఫా నిలవనుంది. కేవలం విజేతకే కాకుండా, రన్నరప్గా నిలిచే జట్టుతో పాటు సెమీఫైనలిస్టులు, క్వార్టర్ ఫైనలిస్టులు మరియు కనీసం గ్రూప్ దశలోనే నిష్క్రమించే జట్లకు కూడా ఈసారి భారీ స్థాయిలో నగదు బహుమతులు అందనున్నాయి.
ముగ్గురు ముద్దుబిడ్డల ఆతిథ్యం.. తొలిసారి 48 జట్లు!
ఈసారి ఫిఫా వరల్డ్ కప్ పలు ప్రత్యేకతలతో సాగనుంది.
సంయుక్త ఆతిథ్యం: చరిత్రలో మొట్టమొదటిసారిగా మూడు దేశాలు—అమెరికా, కెనడా, మెక్సికోలు సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి.
పెరిగిన జట్లు: గతంలో కేవలం 32 జట్లు మాత్రమే మెగా ఈవెంట్లో పాల్గొనేవి. కానీ, ఈసారి ఏకంగా 48 దేశాల జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి.
104 మ్యాచ్ల విందు: జట్ల సంఖ్య పెరగడంతో గతంలో ఉన్న 64 మ్యాచ్ల స్థానంలో ఈసారి ఫుట్బాల్ ప్రేమికులకు మొత్తం 104 మ్యాచ్ల సుదీర్ఘ వినోదం లభించనుంది. 2022లో ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్ కప్లో లియోనెల్ మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా జట్టు విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అప్పట్లో లభించిన ప్రైజ్ మనీ కంటే ఈ 2026 ఎడిషన్లో ప్రకటించిన బహుమతి మొత్తం చాలా ఎక్కువ. జట్ల సంఖ్య పెరగడం, సరికొత్త నాకౌట్ సమీకరణాలతో ఈసారి ఫిఫా కప్ పోరు మరింత ఉత్కంఠభరితంగా మరియు అత్యంత కఠినంగా మారనుంది.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







