ఖతార్లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు
- June 22, 2026
దోహా: ఖతార్లోని రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీలో ఉన్న ఒక ఫ్యాక్టరీలో ఆదివారం సంభవించిన భారీ పేలుడులో 54 మంది గాయపడగా, మరో 18 మంది గల్లంతైనట్లు ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
అధికారుల వివరాల ప్రకారం, సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పేలుడు అనంతరం భారీ అగ్నిప్రమాదం సంభవించగా, అత్యవసర బృందాలు వెంటనే సహాయక చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం గల్లంతైన 18 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ప్రభుత్వ యాజమాన్యంలోని ఖతార్ ఎనర్జీ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీలోని బర్జాన్ స్థానిక గ్యాస్ సరఫరా కేంద్రం కార్యకలాపాలను పునఃప్రారంభించే సమయంలో పేలుడు సంభవించి అగ్ని చెలరేగింది.
ఈ ఘటనపై స్పందించిన అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఇది ఫ్యాక్టరీలో జరిగిన అంతర్గత పేలుడు అని పేర్కొంది. అనంతరం విడుదల చేసిన ప్రకటనలో సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమని స్పష్టం చేసింది.
అయితే ఈ ఘటన వల్ల ఎలాంటి ప్రమాదకర గ్యాస్ లీకేజీ లేదా ప్రజా భద్రతకు ముప్పు కలిగించే రసాయనాల విడుదల జరగలేదని అధికారులు తెలిపారు. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
ప్రమాదానికి గల పూర్తి కారణాల పై అధికారులు దర్యాప్తు చేపట్టారు. గాయపడిన వారికి వైద్య చికిత్స అందిస్తున్నట్లు ఖతార్ ప్రభుత్వం వెల్లడించింది.
తాజా వార్తలు
- ఖతార్లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు
- హర్మూజ్ జలసంధి మూసివేతతో భారీగా పెరిగిన చమురు ధరలు
- రూ.50 లక్షలకోసం భర్త కిడ్నాప్ డ్రామా!
- యూఏఈలో మూడు రోజులపాటు రెయిన్ అలెర్ట్..!!
- సాయికృష్ణ మిస్సింగ్ కేసు..నేడు కోర్టుకు ఆధారాలు
- గల్ఫ్ కార్మికుల ఓటు హక్కుల పై మంత్రి పొన్నం ప్రభాకర్తో చర్చ
- దుబాయ్లో బ్యాడ్మింటన్ ఆడుతూ భారతీయ ప్రవాసి మృతి..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో బొంగో సంస్కృతి బహ్రెయిన్ రక్తదాన శిబిరం..!!
- ఫోర్బ్స్ టాప్ 100లో ఆరు కువైట్ ఫ్యామిలీ ఎంటర్ప్రైజెస్ కు చోటు..!!
- నార్త్ అల్ బతినాలో రిఫ్రిజిరేషన్ యూనిట్ల చోరీ..ఇద్దరు అరెస్ట్..!!







