జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..

- July 07, 2026 , by Maagulf
జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..

జకార్తా: భారత ప్రధాని జకార్తా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో స్వయంగా విమానాశ్రయానికి చేరుకుని ప్రధానికి ఘన స్వాగతం పలికారు. ఒక దేశాధినేత మరో దేశాధినేతను స్వయంగా విమానాశ్రయంలో ఆహ్వానించడం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ సందర్భంగా ప్రధాని స్పందిస్తూ, "జకార్తాకు చేరుకున్నాను. విమానాశ్రయానికి స్వయంగా వచ్చి నాకు స్వాగతం పలికిన అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో గారి ఆత్మీయత నన్ను ఎంతో కదిలించింది. వారి ఈ ఆతిథ్యం భారత్–ఇండోనేషియా మధ్య ఉన్న బలమైన స్నేహబంధానికి ప్రతీక" అని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com