ఒమాన్లో అడ్వెంచర్ టూరిస్టులకు హెచ్చరిక..!!
- July 28, 2026
మస్కట్: అడ్వెంచర్ టూరిజం, ట్రెక్కింగ్ వంటి సాహస యాత్రలకు వెళ్లే వారు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఒమాన్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) సూచించింది. నేషనల్ రిస్క్ రిజిస్టర్తో కలిసి నిర్వహిస్తున్న "వాట్ ఇఫ్?" అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ సూచనలు జారీ చేసింది.
సాహస యాత్రలకు వెళ్లే వారు తప్పనిసరిగా లైసెన్స్ పొందిన అడ్వెంచర్ టూరిజం సంస్థలు, గుర్తింపు పొందిన గైడ్ల సేవలను వినియోగించాలని తెలిపింది. అలాగే అనుమతించిన మార్గాల్లోనే ప్రయాణించడంతో పాటు, ప్రయాణ వివరాలను కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు ముందుగానే తెలియజేయాలని సూచించింది. అత్యవసర పరిస్థితులకు అవసరమైన భద్రతా సామగ్రి, కమ్యూనికేషన్ పరికరాలను వెంట తీసుకెళ్లాలని పేర్కొంది.
ఒకవేళ అడవుల్లో లేదా కొండ ప్రాంతాల్లో దారి తప్పితే భయపడకుండా సురక్షిత ప్రాంతంలోనే ఉండాలని, వెంటనే సంబంధిత అధికారులకు లేదా గైడ్కు సమాచారం ఇవ్వాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో 9999కు కాల్ చేయాలని లేదా 'నిదా' (Nida) ఎమర్జెన్సీ యాప్ ద్వారా తమ లొకేషన్ను పంపి సహాయం కోరాలని సీడీఏఏ తెలిపింది.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్వేస్తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్







