యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...
- July 28, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ పెట్టుబడులు, పారిశ్రామిక భాగస్వామ్యాలు మరియు అంతర్జాతీయ సహకారంలో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. యూరప్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన ప్రముఖ ప్రవాస భారతీయుడు జయ్ కుమార్ గుంటుపల్లి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా తనపై విశ్వాసం ఉంచి యూరప్కు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జయ్ కుమార్ గుంటుపల్లి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని ఆయన పేర్కొన్నారు.
యూరప్లో పెట్టుబడులను ఆకర్షించడం, ప్రముఖ సంస్థలతో పారిశ్రామిక భాగస్వామ్యాలను ఏర్పరచడం, అత్యాధునిక సాంకేతిక సహకారాన్ని విస్తరించడం, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్కు ప్రపంచ స్థాయిలో కొత్త అవకాశాలు తీసుకురావడమే తన లక్ష్యమని ఆయన వెల్లడించారు.
రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను రాబట్టడంతో పాటు, అంతర్జాతీయ సంస్థలతో సన్నిహిత సంబంధాలు పెంపొందించి ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ పెట్టుబడిదారులకు మరింత ఆకర్షణీయ గమ్యస్థానంగా తీర్చిదిద్దడంలో ఈ నియామకం కీలకంగా మారుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్వేస్తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్







