నిధి అగర్వాల్, వరాహ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ నెం.1 క్రేజీ మైథాలజీ థ్రిల్లర్ గ్రాండ్ గా లాంచ్
- August 17, 2026
నిధి అగర్వాల్ హీరోయిన్ గా వరాహ్ ఫిల్మ్స్ బ్యానర్పై ప్రొడక్షన్ నంబర్ 1గా తెరకెక్కనున్న కొత్త చిత్రాన్ని ఈరోజు గ్రాండ్గా లాంచ్ చేశారు.
మైథాలజీ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న చిత్రానికి సునీత్ పడోల్కర్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, ‘తంత్ర’ ఫేమ్ శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు.
సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పీ. అశోక్, పీ. రేణుక కెమెరా స్విచ్ ఆన్ చేయగా, హుర్మత్ సర్నా క్లాప్ ఇచ్చారు. హీరోయిన్ నిధి అగర్వాల్ తోపాటు చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది. పోస్టర్లో నిధి అగర్వాల్ లుక్ చాలా ఇంట్రెస్టింగ్గా, ఇప్పటివరకు ఆమె కనిపించని కొత్త అవతార్ను పరిచయం చేసేలా ఉంది.
హీరోయిన్ ఓరియంటెడ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం దర్శకుడు పవర్ఫుల్ కథ ని సిద్ధం చేశారు.
ఈ సినిమా టైటిల్తో పాటు మిగతా నటీనటులు, టెక్నికల్ టీమ్కు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు.
హీరోయిన్: నిధి అగర్వాల్
దర్శకుడు: శ్రీనివాస్ గోపిశెట్టి
నిర్మాత: సునీత్ పడోల్కర్
బ్యానర్: వరాహ్ ఫిల్మ్స్
పిఆర్వో : వంశీ శేఖర్
తాజా వార్తలు
- ఇరాన్తో తాత్కాలిక ఒప్పందం పొడిగింపుపై ఆసక్తి లేదు: ట్రంప్
- డిగ్రీ విద్యార్థులకు ఎస్బీఐ ప్రత్యేక స్కాలర్షిప్
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా NATS వినూత్న కార్యక్రమం
- వికసిత భారత్ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర–పూర్వ ఉపరాష్ట్రపతి పిలుపు
- దుబాయ్ ఎయిర్పోర్టులో ఉబర్, కరీమ్ ప్రయాణికుల కోసం ప్రత్యేక వెయిటింగ్ లాంజ్
- తెలంగాణలో సర్ ముసాయిదా విడుదల..
- తమిళనాడులో విజయ్ 100రోజుల పాలన పూర్తి..
- 2026 తొలి ఆరు నెలల్లో షేక్ జాయెద్ గ్రాండ్ మసీదుకు 31.27 లక్షల మంది సందర్శకులు
- జెడ్డాలో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్తో ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ భేటీ







