యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్తో ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ భేటీ
- August 17, 2026
అబుదాబి: యూఏఈ అధ్యక్షుడు హిజ్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఒమన్ సుల్తాన్ హిజ్ మెజెస్టీ హైతమ్ బిన్ తారిక్తో సోమవారం భేటీ అయ్యారు. యూఏఈలో స్నేహపూర్వక పర్యటనలో భాగంగా వచ్చిన సుల్తాన్ హైతమ్కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ సోదర సంబంధాలు, పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇద్దరు నేతలు చర్చించారు. ముఖ్యంగా ఆర్థిక, అభివృద్ధి రంగాల్లో సహకారాన్ని విస్తరించి, ఇరు దేశాల ఉమ్మడి ప్రాధాన్యతలు, ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు ప్రజల సంక్షేమం, సుసంపన్నతకు మరింతగా కృషి చేయాలని నిర్ణయించారు.
అలాగే, ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించిన ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇద్దరు నేతలు అభిప్రాయాలను పంచుకున్నారు. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్ర పరిణామాలు, ప్రాంతీయ భద్రత, సుస్థిరత, శాంతిని బలోపేతం చేసేందుకు కొనసాగుతున్న ప్రయత్నాలపై చర్చించారు.
ప్రస్తుతం ప్రాంతం ఎదుర్కొంటున్న ఉమ్మడి సవాళ్ల నేపథ్యంలో వివిధ అంశాలపై పరస్పర సంప్రదింపులను కొనసాగించాలని, ప్రాంతీయ భద్రత మరియు స్థిరత్వాన్ని కాపాడేందుకు ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని ఇరు దేశాల నేతలు పునరుద్ఘాటించారు.
ఈ సమావేశంలో దుబాయ్ తొలి డిప్యూటీ పాలకుడు, ఉప ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి షేక్ మక్తూమ్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, షేక్ సురూర్ బిన్ మొహమ్మద్ అల్ నహ్యాన్, యూఏఈ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తదితరులు పాల్గొన్నారు.
ఒమన్ సుల్తాన్ వెంట వచ్చిన ప్రతినిధి బృందంలో రక్షణ వ్యవహారాల డిప్యూటీ ప్రధానమంత్రి సయ్యద్ షిహాబ్ బిన్ తారిక్ అల్ సయీద్, మస్కట్ గవర్నర్, రాష్ట్ర మంత్రి సయ్యద్ బిలారబ్ బిన్ హైతమ్ అల్ సయీద్తో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు ఉన్నారు.
సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ సోమవారం ఉదయం అబుదాబిలోని ప్రెసిడెన్షియల్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. ఆయనకు యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో పాటు పలువురు షేక్లు, మంత్రులు, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- భూకంప బాధిత కొలంబియాలో 10 పాఠశాలల పునర్నిర్మాణానికి షకీరా హామీ
- టీనేజర్ల కోసం కొత్త వెర్షన్ ChatGPT..!
- యూఏఈలో క్షిపణి ముప్పు అలెర్ట్ ఉపసంహరణ.. సాధారణ కార్యకలాపాలకు అనుమతి
- యూఎస్ అధ్యక్షుడు ట్రంప్తో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- పార్టీ కంటే అభ్యర్థే ప్రధానం-పీపుల్స్ పల్స్ తెలంగాణ పట్టభద్రుల మూడ్ రిపోర్ట్
- ఉచితంగా జర్మన్ భాష నేర్పించి విదేశాల్లో ఉద్యోగాలు!
- చట్టాల ఉల్లంఘన పై మెటా సంస్థకు కేంద్ర ప్రభుత్వం తీవ్ర హెచ్చరిక
- ఖతార్లో కస్టమ్స్ సేవల మెరుగుదలకు ‘షారెక్’లో సర్వే..!!
- కువైట్లో 45.5 శాతం తగ్గిన కిడ్నాప్ కేసులు..!!
- లైసెన్స్ లేకుండా నగదు బదిలీలు.. ఆసియా ప్రవాసుడు అరెస్ట్..!!







