భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా NATS వినూత్న కార్యక్రమం
- August 17, 2026
అమెరికా: భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ మిస్సోరీ చాప్టర్ సభ్యులు వినూత్నంగా సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాజ శ్రేయస్సే ధ్యేయంగా సెయింట్ లూయిస్ ప్రాంతీయ ఫుడ్ బ్యాంక్ లో జరిగిన ప్రత్యేక ఆహార సేకరణ, ప్యాకేజింగ్ కార్యక్రమంలో నాట్స్ టీమ్ చురుగ్గా పాల్గొని సేవలు అందించింది. పేదలు, నిరుపేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాట్స్ వాలంటీర్లు, తెలుగు కుటుంబాలు స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. సుమారు 5,400 పౌండ్ల (సుమారు 2.4 టన్నులు) ఆహార పదార్థాలను వర్గీకరించి, ప్యాక్ చేశారు. ఈ ఆహారం ద్వారా దాదాపు 4,500 మంది నిరుపేదలకు పౌష్టికాహార భోజనం అందనుంది. ఈ సేవా కార్యక్రమంలో నాట్స్ నార్త్ సెంట్రల్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ సందీప్ కొల్లిపర, నాట్స్ మిస్సోరీ చాప్టర్ జాయింట్ కోఆర్డినేటర్ అన్వేష్ చాపరాలలతో పాటు చాప్టర్ ప్రతినిధులు మధుసూధన్ దడ్డాల, నరేష్ రాయంకుల తదితరులు ఈ పాల్గొని తమ వంతు సహాయ సహకారాలు అందించారు.
తెలుగు సమాజానికి, అలాగే స్థానిక అమెరికన్ సమాజానికి సహాయం చేయడంలో నాట్స్ ఎల్లప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా నాట్స్ నాయకులులు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఆకలితో ఉన్నవారికి బాసటగా నిలవడం ఎంతో తృప్తినిచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాట్స్ వాలంటీర్లకు, నాట్స్ సభ్యులకు నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, నాట్స్ అధ్యక్షుడు రాజ్ అల్లాడ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

తాజా వార్తలు
- ఇరాన్తో తాత్కాలిక ఒప్పందం పొడిగింపుపై ఆసక్తి లేదు: ట్రంప్
- డిగ్రీ విద్యార్థులకు ఎస్బీఐ ప్రత్యేక స్కాలర్షిప్
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా NATS వినూత్న కార్యక్రమం
- వికసిత భారత్ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర–పూర్వ ఉపరాష్ట్రపతి పిలుపు
- దుబాయ్ ఎయిర్పోర్టులో ఉబర్, కరీమ్ ప్రయాణికుల కోసం ప్రత్యేక వెయిటింగ్ లాంజ్
- తెలంగాణలో సర్ ముసాయిదా విడుదల..
- తమిళనాడులో విజయ్ 100రోజుల పాలన పూర్తి..
- 2026 తొలి ఆరు నెలల్లో షేక్ జాయెద్ గ్రాండ్ మసీదుకు 31.27 లక్షల మంది సందర్శకులు
- జెడ్డాలో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్తో ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ భేటీ







