కువైట్లో జైలు శిక్ష అనుభవిస్తున్న వారికి రాజు క్షమాబిక్ష

- September 07, 2016 , by Maagulf
కువైట్లో జైలు శిక్ష అనుభవిస్తున్న వారికి  రాజు క్షమాబిక్ష

కువైట్లో జైలు శిక్ష అనుభవిస్తున్న కొందరికి ఆ దేశ రాజు (అమిర్) షేక్ సబా అల్ అహ్మద్ అల్ సబా క్షమాభిక్ష ప్రకటించారు. బక్రీద్ పండుగ సందర్భంగా కొందరికి మిగిలిన శిక్ష కాలాన్ని మాఫీ చేయగా మరికొందరి శిక్షలను తగ్గించినట్లుగా కువైట్ ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. అయితే ఆ ఖైదీల జాతీయతను మాత్రం ప్రకటించలేదు. కాగా, ఇలాంటి సందర్భాలలో ఖైదీల వివరాలను గల్ఫ్ దేశాలు వెల్లడించవు. భారత నుంచి మాదక ద్రవ్యాలు రవాణా చేస్తూ పట్టుబడి కువైట్ జైళ్లలో మగ్గుతున్న వారిలో పలువురు అమాయకులు ఉన్నారు. వారిలో కొందరు ప్రవాసాంధ్రులు కూడా శిక్ష అనుభవిస్తున్నారు. ఈ విషయాన్ని కువైట్లోని భారతీయ ఎంబసీతో పాటు కేంద్ర ప్రభుత్వం కువైట్ పాలకుల దృష్టికి తీసుకెళ్లింది. కువైట్ వచ్చిన విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వీ.కే.సింగ్ ఇక్కడి అధికారులతో సమావేశమయ్యారు. ఆ వెంటనే కువైట్ అమిర్ ప్రకటన వెలువడడం గమనార్హం. కాగా, బుధవారం భారతీయ ఎంబసీలో మహత్మాగాంధీ విగ్రహావిష్కరణ అనంతరం మంత్రి వి.కె.సింగ్ ప్రవాసీ ప్రతినిధులతో సమావేశమవుతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com