అక్టోబర్6,2017 నుంచి ఫుట్బాల్ వరల్డ్కప్
- October 25, 2016
భారత్ తొలిసారిగా అంతర్జాతీయ ఫుట్బాల్ కప్ ఛాంపియన్షిప్నకు ఆతిథ్యమివ్వబోతోంది. 2017లో అండర్-17 ఫుట్బాల్ వరల్డ్కప్ ఇక్కడ జరగనుంది. అక్టోబర్ 6 నుంచి 28 వరకు మ్యాచ్లు జరుగుతాయని ప్రపంచ ఫుట్బాల్ సమాఖ్య ఫిఫా ఈ రోజు ప్రకటించింది. మ్యాచ్ల నిర్వహణ కోసం ఇప్పటికే ఐదు వేదికలను ఎంపిక చేసిన ఫిఫా బృందం.. చివరిదైన ఆరో వేదిక కోసం నేడు కోల్కతాలో పర్యటించి ఆమోదం తెలిపింది. ఇక్కడి మౌలిక వసతులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఆరు వేదికల్లో ఏ మ్యాచ్ ఎక్కడ జరగనుందనే వివరాలను జులై 7న వెల్లడించనున్నారు. .
కోల్కతాలోని స్టేడియంలో 75 నుంచి 80 శాతం పనులు పూర్తయ్యాయని..
జనవరి 31 వరకు స్టేడియంను సిద్ధం చేస్తామని పశ్చిమ్బంగా క్రీడల శాఖ మంత్రి ఆరూప్ బిశ్వాస్ తెలిపారు. ఇప్పటికే కొచ్చి, ముంబయి, గువహటి, దిల్లీ, మార్గావ్(గోవా) నగరాలను ఫిఫా బృందం పరిశీలించి మ్యాచ్ల నిర్వహణకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







