అక్టోబర్‌6,2017 నుంచి ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌

- October 25, 2016 , by Maagulf
అక్టోబర్‌6,2017 నుంచి ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌

భారత్‌ తొలిసారిగా అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ కప్‌ ఛాంపియన్‌షిప్‌నకు ఆతిథ్యమివ్వబోతోంది. 2017లో అండర్‌-17 ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌ ఇక్కడ జరగనుంది. అక్టోబర్‌ 6 నుంచి 28 వరకు మ్యాచ్‌లు జరుగుతాయని ప్రపంచ ఫుట్‌బాల్‌ సమాఖ్య ఫిఫా ఈ రోజు ప్రకటించింది. మ్యాచ్‌ల నిర్వహణ కోసం ఇప్పటికే ఐదు వేదికలను ఎంపిక చేసిన ఫిఫా బృందం.. చివరిదైన ఆరో వేదిక కోసం నేడు కోల్‌కతాలో పర్యటించి ఆమోదం తెలిపింది. ఇక్కడి మౌలిక వసతులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఆరు వేదికల్లో ఏ మ్యాచ్‌ ఎక్కడ జరగనుందనే వివరాలను జులై 7న వెల్లడించనున్నారు. .
కోల్‌కతాలోని స్టేడియంలో 75 నుంచి 80 శాతం పనులు పూర్తయ్యాయని..

జనవరి 31 వరకు స్టేడియంను సిద్ధం చేస్తామని పశ్చిమ్‌బంగా క్రీడల శాఖ మంత్రి ఆరూప్‌ బిశ్వాస్‌ తెలిపారు. ఇప్పటికే కొచ్చి, ముంబయి, గువహటి, దిల్లీ, మార్గావ్‌(గోవా) నగరాలను ఫిఫా బృందం పరిశీలించి మ్యాచ్‌ల నిర్వహణకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com