నిర్మాత కె.కె.రాధామోన్ మూడు చిత్రాలను నిర్మించే ప్లాన్ ...
- November 04, 2016
తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య కొత్త హీరోల సందడి బాగా మొదలైంది. ఇక అధినేత, ఏమైంది ఈవేళ, బెంగాల్టైగర్ వంటి సూపర్హిట్ అందించి ప్రస్తుతం లక్ష్మీరాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై పృథ్వీ, నవీన్చంద్ర హీరోలుగా ఇ.సత్తిబాబు దర్శకత్వంలో నిర్మించిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' సెన్సార్ పూర్తి చేసుకొని నవంబర్లోనే విడుదలకు సిద్ధమైంది. ఇప్పటి వరకు తెలుగులో థర్టీ ఈయర్స్ ఇండస్ట్రీ అంటూ కడుపుబ్బా నవ్వించిన ఫృథ్వి ప్రధాన పాత్రలో కనిపిస్తున్నాడు.సెంటిమెంట్, కామెడీ తో కూడిన ఈ చిత్రం మంచి ప్రజాదరణ లభిస్తుందని అంటున్నారు చిత్ర యూనిట్.తాజాగా ఈ చిత్ర నిర్మాత కె.కె.రాధామోన్ మరో మూడు చిత్రాలను నిర్మించే ప్లాన్ లో ఉన్నారు. యంగ్ హీరో నాగశౌర్య హీరోగా జనవరిలో ఓ చిత్రాన్ని ప్రారంభిస్తున్నారు. అలాగే ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా ఇంకో చిత్రాన్ని నిర్మించనున్నారు.యూత్స్టార్ నితిన్ హీరోగా మరో చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఈ మూడు చిత్రాల ప్లానింగ్లో, 'మీలో ఎవరు కోటీశ్వరుడు' చిత్రం విడుదల సన్నాహాల్లో నిర్మాత కె.కె.రాధామోహన్ చాలా బిజీగా వున్నారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







