జమ్మూ కాశ్మీర్లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు
- November 29, 2016
జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బోర్డర్లో ఆర్మీపై దాడులకు తెగబడుతూ... బోర్డర్ దాటి భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన సైన్యం టెర్రరిస్టుల ప్రయత్నాలను తిప్పికొట్టింది. ఎదురు దాడికి దిగుతూ ముష్కర మూకల్ని పరుగులు పెట్టించింది. కాసేపు భారత బలగాలకు-ఉగ్రవాదులకు మధ్య బీకర యుద్ధం జరిగింది. రెండుచోట్ల జరిగిన ఎన్కౌంటర్లలో ఏడుగుర్ని సైన్యం మట్టుబెట్టింది.
జమ్మూకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగ్రోటా ప్రాంతంలో ఆర్మీ క్యాంపుపై ముందుగా కాల్పులు జరిపారు. గ్రనైడ్లతో దాడులకు దిగారు. ఈ ఘటనలో ఓ జవాను గాయపడ్డారు. నిమిషాల్లోనే సైన్యం అలర్టయ్యింది. కౌంటర్గా ఫైరింగ్కు దిగడంతో... టెర్రరిస్టులు పక్కనే ఉన్న భవనాల్లో నక్కారు. వెంటనే చుట్టు పక్కల ఉన్న ఇళ్లు, స్కూళ్లు ఖాళీ చేయించి వారిని చుట్టుముట్టారు. బలగాల కాల్పుల్లో నలుగరు తీవ్రవాదులు హతమయ్యారు. అయితే ఉగ్రవాదుల దాడుల్లో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. మరో ఇద్దరు గాయపడ్డారు.
మరోవైపు సాంబా సెక్టార్లోని రాంఘడ్లో ఉగ్రవాదులు చొరబడి కాల్పులు జరిపారు. వీరి కాల్పులను ఇండియన్ ఆర్మీ సమర్థంగా తిప్పికొట్టింది. ఈ కాల్పుల్లో ముగ్గురు టెర్రరిస్టులు హతమవ్వగా... ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ముందస్తు జాగ్రత్తగా జమ్మూ-శ్రీనగర్ హైవేను మూసివేసి తనిఖీలు ముమ్మరం చేశారు. అలాగే బోర్డర్ వెంట భద్రతను పెంచి... అదనపు బలగాలను మోహరించారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







