ఇండోనేషియా చేరుకున్న సౌదీ రాజు సల్మాన్
- March 01, 2017
వెయ్యిమంది పరివారం.. మెర్సిడెస్ లిమోజిన్లు సహా 406 టన్నుల సరంజామాతో సౌదీ అరేబియా రాజు సల్మాన్ ఇండోనేషియాలో కాలుమోపారు. జకార్తాలో 81 ఏళ్ల సల్మాన్ విమానం నుంచి ఎస్కులేటర్లో దిగారు. 47 ఏళ్లలో సౌదీ రాజు ఇండోనేషియాలో పర్యటించడం ఇదే తొలిసారి. సౌదీ మోనార్క్ రాక సందర్భంగా బొగొర్ ప్యాలస్లోని దిగంబర విగ్రహాలను వస్త్రాలతో కప్పారు. ఆయన ఓ మసీదును సందర్శించనున్న సందర్భంగా అక్కడ ప్రత్యేకంగా వీఐపీ టాయ్లెట్ నిర్మించారు. 150 మంది వంటవాళ్లను నియమించారు. అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశంగా పేరుగాంచిన ఇండోనేషియాతో ఆర్థిక సంబంధాల మెరుగు కోసం సల్మాన్ పర్యటిస్తున్నారు. జకార్తాలో సమావేశాల అనంతరం ఆయన బాలిలో కొన్ని రోజులు విడిది చేస్తారు. అక్కడ అయిదు లగ్జరీ హోటళ్లు సిద్ధం చేశారు. విమానాల్లో తరలించిన టన్నులకొద్దీ సామగ్రి ఇప్పటికే బాలి తరలించారు. సౌదీ రాజు జపాన్, చైనా, మాల్దీవుల్లో కూడా పర్యటించనున్నారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







