పాడైన కిడ్నీలతో జీవన్మరణ పోరాటం
- March 01, 2017
ఓ వ్యక్తి పాడైపోయిన కిడ్నీలతో జీవన్మరణ పోరాటం చేస్తున్నాడు. వారానికి మూడుసార్లు అబుదాబీ సిటీకి వెళ్ళి డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తోంది. వైద్య చికిత్సకు ఇన్స్యూరెన్స్ సౌకర్యం ఉన్నా, ఉద్యోగం లేకపోవడంతో బతుకునీడ్చడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 47 ఏళ్ళ మొహమ్మద్ సలీమ్ కుటుంబం ఇండియాలో ఉంటోంది. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేస్తే, తిరిగి తాను పని చేయగలుగుతానని అయితే అందుకోసం ఇండియాలో ఖర్చు చేయలేక, యూఏఈలో చట్టాలు అనుకూలించక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు చెప్పాడు. అయితే త్వరలో రానున్న కొత్త చట్టం తనలో ఆశలు కల్పిస్తోందని, తద్వారా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోగలుగుతాననే విశ్వాసంతో ఉన్నాడు మొహమ్మద్. ప్రస్తుత చట్టాల ప్రకారం రక్త సంబంధీకులు మాత్రమే కిడ్నీ దానం చేయడానికి వీలవుతుంది. కొత్త చట్టం ప్రకారం యూఏఈలో నివసించేవారెవరైనా అక్కడ ఉంటున్నవారికి కిడ్నీ దానం చేయవచ్చు. యూఏఈలో 17 ఏళ్ళుగా ఏసీ టెక్నీషియన్గా పనిచేశాడు మొహమ్మద్. ఆరోగ్యం కుదుటపడితే ఉద్యోగం చేసుకుంటానని అంటున్నాడాయన.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







