పాడైన కిడ్నీలతో జీవన్మరణ పోరాటం

- March 01, 2017 , by Maagulf
పాడైన కిడ్నీలతో జీవన్మరణ పోరాటం

ఓ వ్యక్తి పాడైపోయిన కిడ్నీలతో జీవన్మరణ పోరాటం చేస్తున్నాడు. వారానికి మూడుసార్లు అబుదాబీ సిటీకి వెళ్ళి డయాలసిస్‌ చేయించుకోవాల్సి వస్తోంది. వైద్య చికిత్సకు ఇన్స్యూరెన్స్‌ సౌకర్యం ఉన్నా, ఉద్యోగం లేకపోవడంతో బతుకునీడ్చడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 47 ఏళ్ళ మొహమ్మద్‌ సలీమ్‌ కుటుంబం ఇండియాలో ఉంటోంది. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జరీ చేస్తే, తిరిగి తాను పని చేయగలుగుతానని అయితే అందుకోసం ఇండియాలో ఖర్చు చేయలేక, యూఏఈలో చట్టాలు అనుకూలించక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు చెప్పాడు. అయితే త్వరలో రానున్న కొత్త చట్టం తనలో ఆశలు కల్పిస్తోందని, తద్వారా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ చేయించుకోగలుగుతాననే విశ్వాసంతో ఉన్నాడు మొహమ్మద్‌. ప్రస్తుత చట్టాల ప్రకారం రక్త సంబంధీకులు మాత్రమే కిడ్నీ దానం చేయడానికి వీలవుతుంది. కొత్త చట్టం ప్రకారం యూఏఈలో నివసించేవారెవరైనా అక్కడ ఉంటున్నవారికి కిడ్నీ దానం చేయవచ్చు. యూఏఈలో 17 ఏళ్ళుగా ఏసీ టెక్నీషియన్‌గా పనిచేశాడు మొహమ్మద్‌. ఆరోగ్యం కుదుటపడితే ఉద్యోగం చేసుకుంటానని అంటున్నాడాయన. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com