ఫిలిప్పీన్స్లో నరమేధం 32మంది హతం

- August 17, 2017 , by Maagulf
ఫిలిప్పీన్స్లో నరమేధం 32మంది హతం

- పోలీసు కాల్పుల్లో 32 మంది మృతి 
* రోడ్రిగో ప్రభుత్వంలో పెరిగిన హక్కుల ఉల్లంఘనలు 
ఫిలిప్పీన్స్‌లో మానవ హక్కుల ఉల్లంఘన ఘటనలు పెరిగిపోయాయి. తాజాగా, బులాకన్‌ ప్రావిన్స్‌లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలపై 32మంది పౌరులను మనీలా పోలీసులు కాల్చి చంపారు. ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడిగా రోడ్రిగో డ్యుటెర్టే బాధ్యతలు చేపట్టిన తర్వాత డ్రగ్స్‌ అక్రమ రవాణా, వినియోగదారులపై కొరఢా ఝళిపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో, మాదక ద్రవ్యాల అక్రమరవాణాకు పాల్పడుతున్న ముఠాల పట్ల పోలీసులు అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. అయితే, దాడుల్లో పట్టుబడ్డ వారిని విచారించకుండా మట్టుబెట్టడం పట్ల అంతర్జాతీయ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. రాజధాని మనీలాకు ఉత్తరం వైపున ఉన్న బులాకన్‌ ప్రావిన్సులో చోటు చేసుకున్న తాజా ఘటనలో 32 మంది పౌరులు మృతి చెందారు. మరో వంద మంది డ్రగ్స్‌ అక్రమ రవాణాదారులు అరెస్ట్‌ అయ్యారు. అంతేగాకుండా, ఈ దాడిలో భారీఎత్తున మత్తుపదార్థాలు, అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, గతేడాది జులై30 న సదరన్‌ సిటీ ప్రాంతంలో జరిగిన ఆపరేషన్‌లో నగర మేయర్‌తోపాటు 16 మందిని పోలీసులు హతమార్చారు.
12 నగరాల్లో 26 యాంటీ డ్రగ్‌ ఆపరేషన్లు నిర్వహించినట్టు పోలీస్‌ ఉన్నతాధికారి తెలిపారు. 3.3 మిలియన్ల జనాభా ఉండే బులాకన్‌ ప్రాంతంలో గత కొద్ది మాసాల్లో డ్రగ్స్‌ కేసులో అనేక మందిని అరెస్టు చేయడమే కాదు, నేరాలకు పాల్పడినవారిని కాల్చిచంపారు. ఫిలిప్పైన్స్‌లో గతేడాది నుంచి జులై 26 వరకు 3,451 మంది నేరస్థులు హతమయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com