హైదరాబాదులో నివాసం ఉంటున్న ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు ఏపీ మూడు ఆప్షన్స్
- October 27, 2015
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి వెళ్లేందుకు హైదరాబాదులో నివాసం ఉంటున్న ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం మూడు ఆప్షన్స్ ఇస్తుంది. హైదరాబాద్ నుంచి అమరావతికి... ఉద్యోగుల తరలింపు పైన ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఉద్యోగులకు మూడు ఆప్షన్స్ ఇస్తూ సర్క్యులర్ జారీ చేసింది. మూడు ఆప్షన్స్లలో.. ఒకటి నవంబర్ 2015, రెండోది జనవరి 2016, మూడోది జూన్ 2016 ఆప్షన్స్ ఇచ్చారు. వీటిలో ఉద్యోగులు ఎన్నుకోవాల్సి ఉంటుంది. అంతకుముందు తరలింపు గడువుపై ఉద్యోగులు సిఎస్ కృష్ణారావుతో మంగళవారం భేటీ అయ్యారు. బంజారాహిల్స్లో శ్రీవారి ఆలయం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని తిరుమల తిరుపతి కళ్యాణ మండపాలలో ఏసీలు ఏర్పాటు చేస్తామని టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి చెప్పారు. రూ.13.69 కోట్లతో హైదరాబాదులోని బంజారాహిల్స్లో శ్రీవారి ఆలయం నిర్మిస్తామని చెప్పారు. హైదరాబాద్లో శ్రీవారి ఆలయం నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) పాలకమండలి మంగళవారం నిర్ణయం తీసుకుంది. టిటిడి ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో తిరుమలలో జరిగిన పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలునిర్ణయాలు తీసుకున్నారు. శ్రీవారి ఆర్జిత సేవలు, అద్దె గదుల ధరల పెంపుపై ఉపసంఘం ఏర్పాటు చేశారు. వచ్చే సమావేశం నాటికి నివేదిక ఇవ్వాలని ఉపసంఘాన్ని ఆదేశించారు. తిరుపతిలో అరబిందో నేత్రాలయ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే కంటి ఆస్పత్రికి 6 ఎకరాల స్థలం కేటాయిస్తూ తీర్మానం చేశారు
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







