ఇవాంక ట్రంప్ హైదరాబాద్ టూర్ షెడ్యూల్ ఖరారు..
- November 24, 2017
హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ హైదరాబాద్ టూర్ షెడ్యూల్ ఖరారైంది. నవంబరు 28న తెల్లవారుజామున 3.30కి ఆమె శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనుంది. ఆమె వెంట ప్రైవేట్ కమర్షియల్ ప్లైట్ లో వందమంది ప్రతినిధులు రానున్నారు. శంషాబాద్ నుంచి మాదాపూర్ లోని వెస్టిన్ హోటల్ కు చేరుకుని అక్కడ బస చేయనున్నారు. ఉదయం 9.30కి హెచ్ఐసీసీలో ప్రతినిధులతో సమావేశం కానున్న ఇవాంక.. సాయంత్రం 4.30కి ప్రధాని మోడీతో కలిసి గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొననున్నారు.. అనంతరం మోడీతో కలిసి సాయంత్రం 6.30కి ఫలక్ నుమా ప్యాలెస్ లో డిన్నర్ లో పాల్గొంటారు. డిన్నర్ అనంతరం రాత్రి 9 గంటలకు తిరిగి వెస్టిన్ హోటల్ కు వస్తారు. మరుసటి రోజు 29వ తేదీ ఉదయం 9.30కి హెచ్ఐసీసీ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొంటారు. ఆ తర్వాత మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. అనంతరం గోల్కొండను సందర్శించనున్న ఇవాంక.. రాష్ర్ట ప్రభుత్వం ఇచ్చే విందులో పాల్గొంటారు.
అక్కడ నుంచి సాయంత్రం 6 గంటలకు వెస్టిన్ హోటల్ కు చేరుకుని .. రాత్రి 9.30కి శంషాబాద్ నుంచి ఫ్లైట్ లో అమెరికాకు తిరుగు పయనమవుతారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







