ఇవాంక ట్రంప్ హైదరాబాద్ టూర్ షెడ్యూల్ ఖరారు..
- November 24, 2017హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ హైదరాబాద్ టూర్ షెడ్యూల్ ఖరారైంది. నవంబరు 28న తెల్లవారుజామున 3.30కి ఆమె శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనుంది. ఆమె వెంట ప్రైవేట్ కమర్షియల్ ప్లైట్ లో వందమంది ప్రతినిధులు రానున్నారు. శంషాబాద్ నుంచి మాదాపూర్ లోని వెస్టిన్ హోటల్ కు చేరుకుని అక్కడ బస చేయనున్నారు. ఉదయం 9.30కి హెచ్ఐసీసీలో ప్రతినిధులతో సమావేశం కానున్న ఇవాంక.. సాయంత్రం 4.30కి ప్రధాని మోడీతో కలిసి గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొననున్నారు.. అనంతరం మోడీతో కలిసి సాయంత్రం 6.30కి ఫలక్ నుమా ప్యాలెస్ లో డిన్నర్ లో పాల్గొంటారు. డిన్నర్ అనంతరం రాత్రి 9 గంటలకు తిరిగి వెస్టిన్ హోటల్ కు వస్తారు. మరుసటి రోజు 29వ తేదీ ఉదయం 9.30కి హెచ్ఐసీసీ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొంటారు. ఆ తర్వాత మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. అనంతరం గోల్కొండను సందర్శించనున్న ఇవాంక.. రాష్ర్ట ప్రభుత్వం ఇచ్చే విందులో పాల్గొంటారు.
అక్కడ నుంచి సాయంత్రం 6 గంటలకు వెస్టిన్ హోటల్ కు చేరుకుని .. రాత్రి 9.30కి శంషాబాద్ నుంచి ఫ్లైట్ లో అమెరికాకు తిరుగు పయనమవుతారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?