భగ్గుమంటున్న టమాటో ధర
- November 24, 2017
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో టమాట ధరలకు రెక్కలు వచ్చాయి. మిజోరాం రాష్ట్రంలో ఏకంగా కిలో టమాట ధర రూ.100లకు చేరుకొంది. ఢిల్లీలో కిలో టమాట రూ.80లకు విక్రయించారు.
టమాట ఎక్కువగా పండించే కర్ణాటక రాష్ట్రంలో కూడ టమాట ధర పెరిగింది. కిలో రూ.జ45 నుండి 50 రూపాయాలకు విక్రయిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కర్ణాటక, మధ్యప్రదేశ్ల్లోని టొమాటో పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో దిగుబడి తగ్గిపోయిందని అజాద్పూర్ మండి టొమాటో మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ కౌశిక్ తెలిపారు.
మధ్యప్రదేశ్లో 90శాతం మేర పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఈ కారణంగానే ధరలు పెరిగాయని ఆయన చెబుతున్నారు.ఆసియాలోనే అతిపెద్ద హోల్సేల్ మార్కెట్ అయిన అజాద్పూర్ మండిలో కిలో టొమాటో రూ.40-50 పలుకుతోంది. ఇక రిటైల్గా నాణ్యతను బట్టి రూ.70-80కు విక్రయిస్తున్నారు.
ఇక టమాట ఎక్కువగా పండే కర్ణాటక, మధ్యప్రదేశ్లో ఇటీవలి వర్షాలతో పంట దెబ్బతినడంతో సరఫరాలు తగ్గి ధరలు పెరిగాయని వర్తకులు చెబుతున్నారు. రైతులు మళ్లీ సాగు చేస్తున్న టమాట మరో 20 రోజుల్లో మార్కెట్కు వస్తే పరిస్థితిలో కొంత మార్పు ఉంటుందని అజాద్పూర్ మండీలో టమాట మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ కౌశిక్ చెప్పారు.
తాజా వార్తలు
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం









