క్షిపణుల సామర్ధ్యం పెంచుతాం : ఇరాన్
- November 26, 2017
లండన్: యూరోపియన్ యూనియన్ బెదిరింపులకు లోను చేస్తే తమ క్షిపణుల సామర్ధ్యాన్ని 2 వేల కిలోమీటర్ల వరకు పెంచుతామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్జి)కి నేతృత్వం వహిస్తున్న బ్రిగేడియర్ జనరల్ హొస్సేన్ సలామి తెలిపినట్లు స్థానిక వార్తా సంస్థ శనివారం వెల్లడించింది. బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమం గురించి చర్చలు జరిపేందుకు ఇరాన్కు ఫ్రాన్స్ పిలుపునిచ్చింది. దీంతోపాటు 2015లో అణుసమస్యపై ప్రధాన దేశాలతో ఇరాన్ చేసుకున్న ఒప్పందం నుంచి వైదొలిగే అంశాన్ని కూడా చర్చించే అవకాశముంది. తన క్షిపణి కార్యక్రమం రక్షణ కోసం చేస్తున్నదేనని, దానిపై చర్చించాల్సిన అవసరం లేదని ఇరాన్ పదేపదే తెలిపింది. తమ క్షిపణుల సామర్ధ్యాన్ని 2 వేల కిలోమీటర్లకు మించి పెంచకపోవడానికి సాంకేతిక లోపం కారణం కాదని, తాము ఒక వ్యూహాత్మక విధానాన్ని అనుసరిస్తున్నందువల్లే అలా చేయలేదని హొస్సేన్ సలామి తెలిపారని ఆ వార్త సంస్థ తెలిపింది. యూరప్ నుంచి ముప్పు ఉండదని ఇప్పటి వరకు తాము భావించామని, అందవల్ల క్షిపణుల సామర్ధ్యాన్ని పెంచలేదని, యూరప్ ముప్పు తలపెట్టాలని భావిస్తే, క్షిపణుల సామర్ధ్యాన్ని పెంచుతామని ఆయన హెచ్చరించారు.
తాజా వార్తలు
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!







