క్షిపణుల సామర్ధ్యం పెంచుతాం : ఇరాన్
- November 26, 2017
లండన్: యూరోపియన్ యూనియన్ బెదిరింపులకు లోను చేస్తే తమ క్షిపణుల సామర్ధ్యాన్ని 2 వేల కిలోమీటర్ల వరకు పెంచుతామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్జి)కి నేతృత్వం వహిస్తున్న బ్రిగేడియర్ జనరల్ హొస్సేన్ సలామి తెలిపినట్లు స్థానిక వార్తా సంస్థ శనివారం వెల్లడించింది. బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమం గురించి చర్చలు జరిపేందుకు ఇరాన్కు ఫ్రాన్స్ పిలుపునిచ్చింది. దీంతోపాటు 2015లో అణుసమస్యపై ప్రధాన దేశాలతో ఇరాన్ చేసుకున్న ఒప్పందం నుంచి వైదొలిగే అంశాన్ని కూడా చర్చించే అవకాశముంది. తన క్షిపణి కార్యక్రమం రక్షణ కోసం చేస్తున్నదేనని, దానిపై చర్చించాల్సిన అవసరం లేదని ఇరాన్ పదేపదే తెలిపింది. తమ క్షిపణుల సామర్ధ్యాన్ని 2 వేల కిలోమీటర్లకు మించి పెంచకపోవడానికి సాంకేతిక లోపం కారణం కాదని, తాము ఒక వ్యూహాత్మక విధానాన్ని అనుసరిస్తున్నందువల్లే అలా చేయలేదని హొస్సేన్ సలామి తెలిపారని ఆ వార్త సంస్థ తెలిపింది. యూరప్ నుంచి ముప్పు ఉండదని ఇప్పటి వరకు తాము భావించామని, అందవల్ల క్షిపణుల సామర్ధ్యాన్ని పెంచలేదని, యూరప్ ముప్పు తలపెట్టాలని భావిస్తే, క్షిపణుల సామర్ధ్యాన్ని పెంచుతామని ఆయన హెచ్చరించారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









