ఉలువల పరాటాలు
- November 29, 2017
కావలసిన పదార్థాలు
రాజ్మా - ఒక కప్పు, ఉలవలు - అరకప్పు, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి తరుగు - 1 టేబుల్ స్పూను, జీలకర్ర, ధనియాల పొడి, ఆమ్చూర్, గరం మసాల పొడి, మిరియాల పొడి - అర టీ స్పూను చొప్పున, కారం - ఒక టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, గోధుమపిండి - ఒక కప్పు, నూనె - 2 టేబుల్ స్పూన్లు.
తయారుచేసే విధానం
రాజ్మా, ఉలవలు 8 గంటలపాటు నానబెట్టి కుక్కర్లో ఉడికించాలి. చల్లబడ్డాక మిక్సీలో బరకగా రుబ్బుకుని పక్కనుంచాలి. కొద్ది నూనెలో జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగు వేగించాలి. ఆమ్చూర్, గరం మసాల, కారం, ఉప్పు, మిరియాల పొడితో పాటు రుబ్బిన మిశ్రమం కూడా వేసి బాగా కలిపి దించేయాలి. ఇప్పుడు తడిపి ముద్ద చేసిన పిండిని కొంత కొంత తీసుకుని పరాటాలు ఒత్తి, మధ్యలో తగినంత ఉలవల మిశ్రమం పెట్టి దగ్గరగా మడవాలి. మళ్లీ నెమ్మదిగా పరాటాలు ఒత్తి పెనంపై రెండు వైపులా నూనెతో కాల్చుకోవాలి. బలవర్ధకమైన ఈ పరాటాలను రైతాతో వేడి వేడిగా తినండి.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









