ఉలువల పరాటాలు
- November 29, 2017
కావలసిన పదార్థాలు
రాజ్మా - ఒక కప్పు, ఉలవలు - అరకప్పు, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి తరుగు - 1 టేబుల్ స్పూను, జీలకర్ర, ధనియాల పొడి, ఆమ్చూర్, గరం మసాల పొడి, మిరియాల పొడి - అర టీ స్పూను చొప్పున, కారం - ఒక టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, గోధుమపిండి - ఒక కప్పు, నూనె - 2 టేబుల్ స్పూన్లు.
తయారుచేసే విధానం
రాజ్మా, ఉలవలు 8 గంటలపాటు నానబెట్టి కుక్కర్లో ఉడికించాలి. చల్లబడ్డాక మిక్సీలో బరకగా రుబ్బుకుని పక్కనుంచాలి. కొద్ది నూనెలో జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగు వేగించాలి. ఆమ్చూర్, గరం మసాల, కారం, ఉప్పు, మిరియాల పొడితో పాటు రుబ్బిన మిశ్రమం కూడా వేసి బాగా కలిపి దించేయాలి. ఇప్పుడు తడిపి ముద్ద చేసిన పిండిని కొంత కొంత తీసుకుని పరాటాలు ఒత్తి, మధ్యలో తగినంత ఉలవల మిశ్రమం పెట్టి దగ్గరగా మడవాలి. మళ్లీ నెమ్మదిగా పరాటాలు ఒత్తి పెనంపై రెండు వైపులా నూనెతో కాల్చుకోవాలి. బలవర్ధకమైన ఈ పరాటాలను రైతాతో వేడి వేడిగా తినండి.
తాజా వార్తలు
- తిరుమల: శోభాయమానంగా పుష్పపల్లకీ సేవ
- సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించిన టాస్క్ ఫోర్స్
- జూలై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాలపు సమావేశాలు
- ఐసిసి ర్యాంకింగ్ లో 'కింగ్' విరాట్ కోహ్లినే!!
- సిరియా సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి
- కేంద్ర మంత్రి పాటిల్ సమక్షంలో చంద్రబాబు, రేవంత్ భేటి
- శ్రీవాణి టికెట్ల కేంద్రంలో సౌకర్యాలు కల్పించండి: టీటీడీ ఈవో శ్యామలరావు
- సలాలా అగ్రిటూరిజం ప్రాజెక్టులో గణనీయమైన పురోగతి..!!
- అబుదాబిలో 12 ప్రైవేట్ స్కూల్స్ పై నిషేధం..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్.. మిర్దిఫ్లో ట్రాఫిక్ డైవెర్షన్స్ అమలు..!!