మలేషియాలో ప్రారంభించిన తెలుగు అకాడమీ
- January 30, 2018
హైదరాబాద్: మలేషియాలో తెలుగు వారికోసం అకాడమీని ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం అకాడమీ కోసం నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్నాయి. ఆ దేశంలో ఉన్న తెలుగు సంఘం.. కౌలాలంపూర్లో ఈ అకాడమీని ఏర్పాటు చేస్తోంది. ఇది సమీప దేశాల్లో ఉన్న తెలుగువారి కోసం ఉపయోగపడుతుంది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా ఈ అకాడమీని నిర్మిస్తున్నది. కౌలాలంపూర్కు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న రవాంగ్ సెలంగర్ ప్రాంతంలో సుమారు 2.5 ఎకరాల స్థలంలో అకాడమీని నిర్మిస్తున్నారు. తెలుగు భాషతో పాటు డ్యాన్స్, మ్యూజిక్, ఆర్ట్స్, ఇతర కళలను కూడా అక్కడ నేర్చుకునే వీలుందని టామ్ ప్రెసిడెంట్ వై.అచ్చయ్య కుమార్ రావు తెలిపారు. మలేషియాలో తెలుగు నేర్చుకుంటున్న సుమారు మూడు వేల మందికి ఈ అకాడమీ వల్ల లాభం చేకూరే అవకాశాలున్నాయి. పొట్టి శ్రీరాములు వర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు విద్యార్థులకు ప్రశ్నాపత్రాలు తయారు చేయనున్నారు. అకాడమీ నిర్మాణం కోసం రూ.40 కోట్లు ఖర్చు చేయనున్నారు. మార్చి 2016లో దీని కోసం శంకుస్థాపన జరిగింది. అయితే మలేషియా ప్రభుత్వం తెలుగు అకాడమీ కోసం 25 కోట్లు కేటాయించింది.
తెలుగు రాష్ర్టాల సీఎంలను త్వరలో మలేషియాకు ఆహ్వానించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు తెలిపారు
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 22.1% పెరిగి నాన్ ఆయిల్ ఎగుమతులు..!!
- భారత్ లో 100 కొత్త ఎయిర్పోర్టులు..కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
- బాలకృష్ణకు అరుదైన గౌరవం- లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం
- ఇరాన్ ఆయిల్ వార్తలపై రిలయన్స్ క్లారిటీ
- భద్రాద్రి పునర్నిర్మాణ ఆలయ నమూనా
- ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవలు: సీఎం రేవంత్
- అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేబినెట్ తీర్మానం
- రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ కీలక సమావేశం
- కువైట్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం..హిజ్బుల్లా నెట్వర్క్ బస్ట్..!!
- రుస్తాఖ్ ఆసుపత్రికి ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్ సక్సెస్..!!









