మలేషియాలో ప్రారంభించిన తెలుగు అకాడమీ
- January 30, 2018
హైదరాబాద్: మలేషియాలో తెలుగు వారికోసం అకాడమీని ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం అకాడమీ కోసం నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్నాయి. ఆ దేశంలో ఉన్న తెలుగు సంఘం.. కౌలాలంపూర్లో ఈ అకాడమీని ఏర్పాటు చేస్తోంది. ఇది సమీప దేశాల్లో ఉన్న తెలుగువారి కోసం ఉపయోగపడుతుంది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా ఈ అకాడమీని నిర్మిస్తున్నది. కౌలాలంపూర్కు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న రవాంగ్ సెలంగర్ ప్రాంతంలో సుమారు 2.5 ఎకరాల స్థలంలో అకాడమీని నిర్మిస్తున్నారు. తెలుగు భాషతో పాటు డ్యాన్స్, మ్యూజిక్, ఆర్ట్స్, ఇతర కళలను కూడా అక్కడ నేర్చుకునే వీలుందని టామ్ ప్రెసిడెంట్ వై.అచ్చయ్య కుమార్ రావు తెలిపారు. మలేషియాలో తెలుగు నేర్చుకుంటున్న సుమారు మూడు వేల మందికి ఈ అకాడమీ వల్ల లాభం చేకూరే అవకాశాలున్నాయి. పొట్టి శ్రీరాములు వర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు విద్యార్థులకు ప్రశ్నాపత్రాలు తయారు చేయనున్నారు. అకాడమీ నిర్మాణం కోసం రూ.40 కోట్లు ఖర్చు చేయనున్నారు. మార్చి 2016లో దీని కోసం శంకుస్థాపన జరిగింది. అయితే మలేషియా ప్రభుత్వం తెలుగు అకాడమీ కోసం 25 కోట్లు కేటాయించింది.
తెలుగు రాష్ర్టాల సీఎంలను త్వరలో మలేషియాకు ఆహ్వానించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు తెలిపారు
తాజా వార్తలు
- క్సైజ్ శాఖ డైరీలు, క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్ర
- అలర్ట్: ఇంట్లో జనరేటర్ వాడుతున్నారా? -అజ్మాన్ పోలీస్ హెచ్చరిక!
- విశాఖ జూ పార్క్ను సందర్శించిన డిప్యూటీ సీఎం
- హిమాచల్లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత
- కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!
- ఫుజైరాలో భారతీయ ప్రవాసుడు అనుమానస్పద మృతి..!!
- కువైట్లో 1.059 మిలియన్లకు పెరిగిన భారతీయ జనాభా..!!
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ గ్రాండ్ రిసెప్షన్ సక్సెస్..!!







