తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
- January 29, 2019తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. తెలంగాణలో ఉన్న బీసీ గురుకులాల్లో 4 వేల 322 పోస్టులు మంజూరు చేసింది. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్తగా ప్రారంభించే 119 బీసీ గురుకులాల్లో విడతల వారీగా వీటిని భర్తీ చేస్తారు. మహాత్మా జ్యోతిబా పులే బీసీ గురుకుల సొసైటీ పరిధిలోని పాఠశాలలు, కార్యాలయంలో 3,717 రెగ్యులర్, 605 ఔట్ సోర్సింగ్ పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 119 బీసీ గురుకులాల ఏర్పాటుకు 2018 ఆగస్టులోనే అనుమతిచ్చింది. బీసీ సంక్షేమ శాఖ వీటికి అవసరమైన పోస్టులను మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అయితే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే సరికి శాసన సభ ఎన్నికల నియామావళి అడ్డొచ్చింది.
తాజా ఉత్తర్వుల్లో 2019- 20 ఏడాదికి పీజీటీ, పీడీ, జేఎల్ పోస్టులు మినహా మిగతా 2,537 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటికి సర్వీస్ నిబంధనలు పూర్తి చేసిన తర్వాత ఉద్యోగ ప్రకటనలు వెలువడే అవకాశముంది. 2020- 21 విద్యా సంవత్సరానికి గురుకులాల్లో 833 పీజీటీ పోస్టులు మంజూరయ్యాయి. 2021- 22 సంవత్సరానికి 119 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులను కేటాయించింది. 2022 23 నాటికి పాఠశాలలు జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ అవుతాయి. అప్పుడు 833 జూనియర్ లెక్చరర్ పోస్టులుంటాయి. ప్రభుత్వం ఉత్తర్వుల్లో వీటిని కూడా చేర్చింది.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్