సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- November 10, 2025
రియాద్ః సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చించాయి. యూఎన్ పర్యాటక జనరల్ అసెంబ్లీ 26వ సమావేశంలో పాల్గొనడానికి రియాద్కు వచ్చిన భారత సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో సౌదీ సాంస్కృతిక మంత్రి ప్రిన్స్ బాదర్ బిన్ అబ్దుల్లా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు మంత్రులు రెండు దేశాల మధ్య బలమైన సాంస్కృతిక సంబంధాలపై సమీక్షించారు. సాంస్కృతిక మరియు ఇతర రంగాల్లో సహకారానికి సంబంధించి ఒక అవగాహన ఒప్పందం (MoU)పై సంతకాలు చేశారు. రెండు దేశాలలో జరిగే సాంస్కృతిక ఉత్సవాలు మరియు కార్యక్రమాలలో పాల్గొనాలని నిర్ణయించారు.
అంతకుముందు "గ్లోబల్ హార్మొనీ 2" లో భాగంగా రియాద్లోని సువైది పార్క్లో జరిగిన భారతీయ సాంస్కృతిక వారోత్సవ కార్యక్రమాలను భారత మంత్రి షెకావత్ సందర్శించారు. ఇది 49 రోజుల పాటు కొనసాగుతుంది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









