ఫస్ట్ లిస్ట్ను రిలీజ్ చేసిన పవన్కళ్యాణ్
- March 14, 2019
జనసేన పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది… 32మంది పేర్లతో ఫస్ట్ లిస్ట్ను రిలీజ్ చేశారు పవన్కళ్యాణ్… అలాగే నలుగురు పార్లమెంట్ అభ్యర్థులను కూడా ఖరారు చేశారు… ఇవాళ రాజమండ్రిలో ఆవిర్భావ సభ నిర్వహిస్తుండగా తొలి జాబితా విడుదల చేయడం గమనార్హం… మరోవైపు జనసేన, వామపక్షాల మధ్య పొత్తు చర్చలు ఈ నెల 16న కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి…
ఏపీలో అభ్యర్థుల జాబితా విడుదలలో మొదట నిలిచింది జనసేన పార్టీ… మొత్తం 32 మంది అభ్యర్థులతో తొలి జాబితాను బుధవారం అర్థరాత్రి దాటాక పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విడుదల చేశారు… అసెంబ్లీ అభ్యర్థులతోపాటు నలుగురు పార్లమెంట్ సభ్యులను కూడా ఖరారు చేశారు…..
ముందే ప్రకటించినట్టుగా రాజమండ్రి నుంచి ఆకుల సత్య నారాయణ, అమలాపురం నుంచి డీఎంఆర్ శేఖర్ ఎంపీగా పోటీ చేయనున్నారు. విశాఖ నుంచి గేదెల శ్రీనుబాబు, అనకాపల్లి నుంచి చింతల పార్ధసారథి ఎంపీలుగా పోటీ చేస్తారని జనసేన ప్రకటించింది. ఇక ఎమ్మెల్యేల జాబితా విషయానికి వస్తే.. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, గుంటూరు వెస్ట్ నుంచి తోట చంద్రశేఖర్, మమ్మిడివరం నుంచి పితాని బాలకృష్ణల పేర్లను పవన్ ఇంతకు ముందే ప్రకటించారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







